M. M. Sreelekha : తెలుగు ఇండస్ట్రీ లో మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి చిత్రాలకు చేసి పేరు తెచ్చుకున్న ఎమ్ ఎమ్ శ్రీలేఖ ఈ మధ్య సినిమాలకు సంగీతం అందించడం లేదు. అలాగే సింగర్ గా కూడా బాగా ఫేమస్ అయిన శ్రీలేఖ ప్రస్తుతం చాలా గ్యాప్ తీసుకున్నారు. అయితే మళ్ళీ ఒక మంచి ప్రాజెక్ట్ తో రీ ఎంట్రీ ఇస్తున్నట్లు, సినిమా వివరాలు చెప్పకూడదని చెప్పడం లేదని తాజా ఇంటర్వ్యూ ల్లో తెలిపారు. ఇక రాజమౌళి, కీరవాణి అన్నయ్యలు అయినా ప్రస్తుతం వారి సినిమాల్లో ఎందుకు పని చేయలేదో వివరించారు.
రాజమౌళి మారిపోయాడు…
రామానాయుడు గారి ప్రొడక్షన్ లో వచ్చిన సినిమాలకు ఎక్కువగా మ్యూజిక్ ఇచ్చిన శ్రీలేఖ ఎందుకని తన సోదరులతో కలిసి ఇప్పుడు పనిచేయడం లేదని విషయానికి క్లారిటీ ఇచ్చారు. రాజమౌళి చాలా ఫ్రెండ్లి గా ఉంటాడని తన మొదటి సీరియల్ శాంతినివాసం కి నేనే మ్యూజిక్ చేసానని చెప్పారు. ఇంక తాను సినిమాల్లో బిజీ అయ్యాక ట్రాక్ చేంజ్ అయిందని అలా మార్పు వచ్చిందని ప్రొఫెషనల్ గా ఎవరికి వారే అన్నట్లు ఉంటాము, కానీ వ్యక్తిగతంగా ఇప్పటికీ కలుస్తాము. పండగలకు కలిస్తే చాలా సందడిగా ఉంటుంది అంటూ చెప్పారు. శ్రీలేఖ తండ్రి గారు స్పిరిచువల్ వ్యక్తి అని, ఎప్పుడు ఆధ్యాత్మిక ధోరణిలో ధ్యానం చేసుకుంటూ ఉంటారని చెప్పారు.
కీరవాణి వారి తండ్రి శివ శక్తి దత్త మొదటి వాడు, ఆయన తరువాత ఐదు మందిలో విజయేంద్ర ప్రసాద్ చివరి వాడు అంటూ వివరించారు. ఇక రామా నాయుడు గారి సినిమాల్లో కొన్నింటికి ఎందుకు మీరు చేయలేదు మొదట అనుకుని అనే ప్రశ్నకు డైరెక్టర్ మారినప్పుడు వాళ్లకు రాపో ఉండే మ్యూజిక్ డైరెక్టర్ తో పని చేయించుకున్నారు అంతే ఇంక వేరే కారణాలు ఏమి లేవు. అయితే రామా నాయుడు గారు అందులో ఒక పాట అయినా నాతో పాడించేవారు అని చెప్పారు శ్రీలేఖ. ఇక తన అన్నదమ్ముల సహాయం, రెఫరెన్స్ ఎప్పుడు సినిమాల్లో అవకాశాల కోసం తీసుకోలేదని, నా సొంతంగా నేను కెరీర్ లో వెళ్లానని చెప్పారు.
తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య…
వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…
సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.…
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…