Featured

Mahanati Savithri : చివరి రోజుల్లో మహానటి సావిత్రి ఎదుర్కొన్న అవమానాలు… కనీసం తిండి పెట్టలేదు.. : గుమ్మడి వెంకటేశ్వరరావు

Mahanati Savithri : అలనాటి తార సావిత్రి హీరోలకు ధీటుగా స్టార్ డమ్ ని సంపాదించుకున్న హీరోయిన్. హీరోలకు సమానంగా అభిమానులను సంపాదించుకున్న మహానటి కొంతమంది హీరోలను స్క్రీన్ మీద తన నటనతో డామినేట్ చేసేది. అందం, అభినయం, వ్యక్తిత్వం అన్నీ కలగలసిన ఏకైక హీరోయిన్ గా సౌత్ సినిమా ఇండస్ట్రీలో చిరస్తాయిగా మిగిలిన తార. పేదరికం నుండి వచ్చిన సావిత్రి గారు ఆ తరువాత సినిమాల్లో నటన ద్వారా కొన్ని వేల కోట్ల ఆస్తులను సంపాదించారు. కానీ చివరి దశలో అదే పేదరికంలో మరణించారు. ఆమె దాన గుణం ఎంతో మందికి అన్నం పెట్టింది, సహాయం ఆందించింది కానీ చివరికి ఆమెకు అన్నం కూడా పెట్టని పరిస్థితి తెచ్చిపెట్టింది.

సావిత్రి జీవితంలోని చేదు జ్ఞాపకాలను పంచుకున్న గుమ్మడి…

సావిత్రి కాల్షీట్ కోసం సినిమా షూటింగ్ నే వాయిదా వేసుకున్న రోజుల నుండి పొట్టకూటి కోసం చిన్న చిన్న వేషాలను కూడా వేసిన ఘటనల వరకూ ఆమె జీవితం ఇప్పటికీ ఎంతో మంది సినిమా వాళ్లకు గుణపాఠంగా ఉంది. అలాంటి ఆమె జీవితం గురించి మహానటి సినిమాలో ఆమె పడిన కాష్టాలను, ఆమె చేసిన గుప్త దానాలను కొంత వరకు చూపించారు. అలాంటి విషయాలనే గుమ్మడి గారు గతంలో ఒక ఇంటర్వ్యూలో సావిత్రి గారి గురించి చెబుతూ పంచుకున్నారు. సావిత్రి గారు తన చివరి రోజుల్లో ఒక రోజు గుమ్మడి గారి ఇంటికి ఆయనకు ఆరోగ్యం బాగోలేక పోతే పరామర్శించడానికి వెళ్లారట.

గుమ్మడి గారిని అన్నా అంటూ పిలిచే సావిత్రి ఆయనతో కాసేపు మాట్లాడి వెళ్లిపోయారట. చికిత్సలో భాగంగా డాక్టర్ మత్తు కలిగించే ఇంజక్షన్ చేయడం వల్ల ఏం జరిగిందో సరిగా గుర్తులేని గుమ్మడి గారు తలగడను సావిత్రి సర్ధడం గుర్తొచ్చి తలగడ కింద చూస్తే రెండు వేల రూపాయలు ఉన్నాయట వెంటనే ఫోన్ చేసి అడిగితే మీరు మర్చిపోయినట్టున్నారు నేను మీ దగ్గర తీసుకున్న డబ్బు నేను పోయే లోపు దమ్మిడి రూపాయి కూడా ఎవరికీ బాకీ పడకూడదని ఇచ్చేస్తున్నా అన్నా, నిన్ననే ఐదు వేలు అడ్వాన్స్ ఒక సినిమా కు ఇచ్చారు ఆ డబ్బు ఇస్తున్నా అంటూ చెప్పిందట.

ఆ మాటలకు గుమ్మడి గారి కళ్ళు చెమ్మగిల్లాయట. ఇక మరో చేదు అనుభవం సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు తగ్గాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా సినిమాలను చేసిన సావిత్రి గారు అక్కడ ప్రొడక్షన్ బాయ్స్ వల్ల కూడా అవమనాలను ఎదుర్కొన్నారట. ఒక షూటింగ్ లో భోజనం సమయంలో అందరూ భోజనం చేస్తుంటే సావిత్రి గారు ఒంటరిగా కూర్చొని ఉన్నారట. అదే సినిమాలో నటిస్తున్న గుమ్మడి గారు ఆరా తీస్తే నాకు ఆకలిగా లేదు అంటూ చెప్పారట.

చాలా మంది నటులకు ఇంటి నుండి క్యారెజీలు వచ్చేవి, మరి కొంతమంది ప్రొడక్షన్ వాళ్ళు పెట్టే భోజనం తినేవాళ్ళు కానీ సావిత్రి గారికి ఇంటి నుండి భోజనం వచ్చే పరిస్థితులు లేవు. ఇక ప్రొడక్షన్ వాళ్ళు పెట్టలేదు, ఈ విషయం అర్థమైన గుమ్మడి గారు అన్నం తిందాం రమ్మని పిలిచారట. కానీ సావిత్రి వద్దనడంతో నువ్వు వచ్చే వరకు నేను తినను అంటూ అనడంతో కన్నీళ్లు పెట్టుకుని వెళ్లి తిన్నారట. అలా ఎన్నో వేలకోట్లు, పేరు ప్రతిష్టలు సంపాదించిన సావిత్రి గారు భర్త బంధువుల మోసాల వల్ల ఆస్తులు పోయి చివరి రోజుల్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు.

Bhargavi

Recent Posts

మోదీని డైరెక్ట్‌గా కలుస్తా.. మంచు లక్ష్మి రాజకీయ వ్యాఖ్యలు వైరల్

టాలీవుడ్ నటి, సామాజిక కార్యకర్తగా గుర్తింపు పొందిన మంచు లక్ష్మి రాజకీయ ప్రవేశంపై చేసిన తాజా వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి.…

51 minutes ago

20 ఏళ్ల ‘పోకిరి’.. రిజెక్ట్ చేసిన హీరోలు, హీరోయిన్లు ఎవరో తెలుసా..?

టాలీవుడ్ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చిత్రాల్లో ఒకటి పోకిరి. సరిగ్గా 20 ఏళ్ల క్రితం విడుదలైన ఈ సినిమా,…

1 hour ago

విష్ణు ప్రియతో పెళ్లి వార్తలపై జేడీ క్లారిటీ.. నిజం ఇదే!

టాలీవుడ్‌లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జే. డి. చక్రవర్తి ప్రస్తుతం తన తాజా సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా…

2 hours ago

కరెంట్ లేకుండా ఇల్లు కూలర్‌లా చల్లగా! ఈ పాత ట్రిక్ ట్రై చేయండి!

వేసవి వేడిని తట్టుకోవడం చాలా మందికి పెద్ద సవాలుగా మారుతోంది. ముఖ్యంగా విద్యుత్ ఖర్చులు పెరుగుతున్న ఈ రోజుల్లో, ఏసీ…

5 hours ago

40 దాటినా ఫిట్‌గా రొనాల్డో… ఈ ఒక్క అలవాటు మీకూ మార్పు తీసుకురాగలదు!

ఫుట్‌బాల్ ప్రపంచంలో వయసు కేవలం సంఖ్య మాత్రమేనని నిరూపించిన పేరు క్రిస్టియానో ​​రొనాల్డో. నలభై దాటిన తర్వాత కూడా యువ…

5 hours ago

బుద్ధ పౌర్ణిమ 2026: ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచిన పవిత్ర దినం.. ప్రాముఖ్యత, ఆచరణ విధానం!

భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో బుద్ధ పౌర్ణిమకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ రోజు బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు జననం,…

5 hours ago