Mahesh Babu intresting comments on bollywood : ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా సర్కార్ వారి పాట సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పరశురాం దర్శకత్వం వహించగా కీర్తిసురేష్ మొదటిసారి మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందించగా మైత్రి మూవీ మేకర్స్, 14రీల్స్, జి ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమా విడుదలకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండగా మహేష్ బాబు తాజాగా మేజర్ చిత్రం నకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.
టాలీవుడ్ నాకు మంచి గుర్తింపు గౌరవం ఇచ్చింది…..
సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడా అని అభిమానులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించిన మేజర్ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఆ వేడుకలో మహేష్ బాబు కాసేపు మీడియాతో ముచ్చటించారు. అప్పుడు ఆయనను కొందరు బాలీవుడ్ ఎంట్రీ కి సంబంధించి ప్రశ్నలు అడుగగా… అందుకు మహేష్ చెప్పిన సమాధానాలు ఆసక్తికరంగా మారాయి.
బాలీవుడ్ ఎంట్రీ గురించి అడిగిన ప్రశ్నలకు ఆయన ఈవిదంగా సమాధానలు చెప్పారు. బాలీవుడ్ నుంచి నాకు ఆఫర్లు బాగానే వస్తున్నాయ్, కానీ వారు నన్ను భరిస్తారు అని నేను అనుకోవడం లేదు. నన్ను భరించలేని చిత్ర పరిశ్రమలో పనిచేస్తే టైం వేస్ట్ చేసుకోవడం అవుతుంది. మనదగ్గర నాకు బాగానే ఆఫర్స్ వస్తున్నాయి. అంతేగాక తెలుగు చిత్ర పరిశ్రమల నాకు మంచి గుర్తింపు, గౌరవం, స్టార్ ఇమేజ్ ఇచ్చింది. వీటి పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. అందుకే, నా పరిశ్రమను వదిలేసి మరేదో ఇండస్ట్రీలో పని చేయాలనే ఆలోచన ప్రస్తుతం నాకు లేదు. సినిమాలు చేయాలని, మరింతగా ఎదగాలని ఎప్పుడూ అనుకుంటాను. నా కల ఇప్పుడు నెరవేరుతోంది’ అంటూ మహేశ్ చెప్పారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…