Mahesh Babu -Namrata: మహేష్ బాబు ఇప్పటికే ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాకుండా ఎన్నో వ్యాపారాలను కూడా ప్రారంభించి వ్యాపార రంగంలో కూడా ఎంతో సక్సెస్ అయిన విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఇప్పటికే ఏషియన్స్ వారితో కలిసి మహేష్ బాబు మల్టీప్లెక్స్ థియేటర్స్ నిర్మించగా తాజాగా ఏషియన్ వారితో కలిసి హైదరాబాదులో రెస్టారెంట్ కూడా ప్రారంభించబోతున్న విషయం మనకు తెలిసిందే.
అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ రెస్టారెంట్ నిర్మాణం జరిగింది. ఇక ఈ రెస్టారెంట్ కు ఏఎన్ అని నామకరణం కూడా చేశారు.ఏ అంటే ఏషియన్స్ ఎన్ అంటే నమ్రత అని వచ్చేలా ఏషియన్స్ వారితో కలిసి తన భార్య పేరు మీదగా మహేష్ బాబు రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగుపెట్టారు.
ఇప్పటివరకు మహేష్ బాబు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టగా అన్ని వ్యాపారాలు కూడా ఎంతో అభివృద్ధి చెందాయి. ఈ క్రమంలోనే రెస్టారెంట్ వ్యాపారం కూడా మంచి లాభాలను అందుకుంటే ఈ రెస్టారెంట్ ను వివిధ పట్టణాలలో ప్రారంభించనున్నట్లు సమాచారం. ఇకపోతే నేడు ఎంతో ఘనంగా ఈ రెస్టారెంట్ లో పూజా కార్యక్రమాలను నిర్వహించి రెస్టారెంట్ ప్రారంభించారు.
ఈ పూజా కార్యక్రమాలకు మహేష్ బాబు దంపతులు దూరంగా ఉన్నారు. తాజాగా కృష్ణ గారు మరణించడం వల్లే ఇలాంటి పూజా కార్యక్రమాలలో పాల్గొనకూడదు అని సన్నిహితులు తెలియజేయడంతో మహేష్ బాబు నమ్రత దంపతులు ఈ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.ఇలా మహేష్ బాబు సమ్రత పూజా కార్యక్రమాలు చేయకూడదని తెలియడంతో ఏషియన్స్ వారు ఈ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…