సినిమా ఇండస్ట్రీ లోకి నటనను వారసత్వంగా తీసుకొని అడుగుపెట్టిన హీరోలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరని చెప్పవచ్చు.బాల నటుడిగా తన తండ్రితో కలిసి ఎన్నో సినిమాలలో నటించిన మహేష్ బాబు ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్నారు. మహేష్ బాబు తన చిన్నతనంలోనే నటనను ఎంతో సీరియస్ గా తీసుకోవడంతో ప్రస్తుతం ఈ స్థాయిలో ఉన్నారని చెప్పవచ్చు.
సాధారణంగా సినిమా షూటింగ్ సమయంలో ఎంతో కష్టతరమైన సన్నివేశాలను తెరకెక్కించేటప్పుడు హీరోల స్థానంలో డూప్ లను పెట్టి ఆ సన్నివేశాలను చిత్రీకరిస్తారు. అయితే మహేష్ బాబు తన చిన్నతనంలోనే డూప్ లేకుండా పలు స్టంట్ లో నటించారు. తన తండ్రి కృష్ణ దర్శకత్వం వహిస్తున్న అటువంటి “శంఖారావం” సినిమాలో మహేష్ బాబు ఓ పాత్రలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో అచ్చం మహేష్ బాబు డ్రెస్ మాదిరిగానే మరొక కుర్రాడు డ్రెస్ ధరించి ఉన్నాడు. అతనిని చూసిన మహేష్ నాలాంటి డ్రెస్ వేశారని అసిస్టెంట్ డైరెక్టర్ ని అడిగారు.
అందుకు డైరెక్టర్ సినిమాలో పై నుంచి కిందకు దూకే సన్నివేశం ఉంది. అందులో నటించడానికి నీకి డూప్ గా ఆ కుర్రాడిని తీసుకున్నామని చెప్పగా.. అది విన్న మహేష్ బాబు ఈ మాత్రం దానికి డూప్ ఎందుకు నేనే చేస్తా అంటూ.. కెమెరా లేకపోయినా వెంటనే గోడ పై నుంచి కిందకు దూకారు. ఈ క్రమంలోనే ఆ సినిమాలో తనకు డూప్ అవసరం లేదని, తానే స్వయంగా ఆ సన్నివేశంలో పాల్గొన్నారు.
కేవలం ఈ సినిమాలో మాత్రమే కాకుండా”కొడుకు దిద్దిన కాపురం” అనే సినిమాలో ఒక బైక్ స్టంట్ చేయాల్సి ఉంది. అందుకోసం కూడా ఒక డూప్ ను పెట్టారు. అయితే సెట్ లో తనతండ్రి ఉంటే తనని ఆ స్టంట్ చేయనివ్వరని చెప్పి తన తండ్రి లంచ్ కి వెళ్ళిన సమయంలో స్టంట్ మాస్టర్ ని పిలిచి తనని ఒప్పించి సన్నివేశంలో డూప్ లేకుండా మహేష్ బాబు నటించారు.
అలాగే బాలచందర్ సినిమాలో కూడా మహేష్ బాబు డూప్ లేకుండా నటిస్తున్న సమయంలో ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నటువంటి శరత్ కుమార్ కూడా డూప్ లేకుండా నటిస్తానని పట్టుబడ్డాడు. ఈ క్రమంలోనే చిత్రబృందం అందుకు ఒప్పుకోవడంతో డూప్ లేకుండా నటించడం వల్ల శరత్ కుమార్ షూటింగ్ సమయంలో ప్రమాదానికి గురై కొద్దిగా ఫ్యాక్చర్ అయ్యింది. ఈ విధంగా ప్రమాదం జరిగినప్పటికీ వీరు మాత్రం డూప్ లేకుండా నటించడం మానలేదని చెప్పవచ్చు.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…