Featured

Major Cinema : మేజర్ సినిమా టికెట్ రేట్లను తగ్గిస్తూ చిత్ర యూనిట్ నిర్ణయం.. మన సినిమా అంటూ ట్విట్టర్ పోస్ట్ విడుదల…!

Major Cinema : విభిన్న కథలతో ప్రయోగాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న అడవి శేష్, తాజాగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తీసిన చిత్రం మేజర్. ఈ సినిమా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. పాన్ ఇండియా సినిమాగా విడుదల అవుతున్న ఈ సినిమా కోసం అడవి శేష్ ఎప్పుడు లేనంతగా అన్ని చోట్లకు తిరుగుతూ ప్రచారం చేస్తున్నాడు. ఎలాగైనా ఈ సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేయాలని భావిస్తున్నారు.

టికెట్ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం…..

ఇక ఇండియా మొత్తం చుట్టేస్తూ ప్రచారం చేస్తున్న మేజర్ టీం ఇక మరో నిర్ణయంతో అందరిని ఆకర్షించారు. తెలుగు రాష్ట్రాలలో థియేటర్లలో టికెట్ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల వివాదం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని మలుపులు తిరిగిందో అందరికి తెలిసిన విషయమే. ఇక టికెట్ రేట్లను పెంచుకునే వెసులుబాటు కల్పించాలని ఏపీ సీఎంని పలువురు సినీ తారలు స్వయంగా వచ్చి కలిశారు. ఇక టికెట్ రేట్లను పెంచడంతో పెద్ద సినిమాలకు కూడా డిబేట్ పడింది. సినిమా బాగుంటే ఒక వారం ఆడుతుందేమో కానీ ఇక సినిమా మీద టాక్ లేకపోతే మొదటి వారం కలెక్షన్స్ కూడా గోవింద అంటాయి. ఈ విషయం ఆచార్య సినిమాతో రుజువైంది. అందుకే మేజర్ సినిమా యూనిట్ జాగ్రత్త పడుతున్నారు.

తెలంగాణ సింగల్ స్క్రీన్ లో 150 రూపాయలు, మల్టీ ప్లెక్స్ లో 195 రూపాయలుగా టికెట్ రేట్ నిర్ణయించారు . అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ లో 147 రూపాయలు సింగిల్ స్క్రీన్ కి, 177 రూపాయలు మల్టీప్లెక్స్ రేట్స్ ఫిక్స్ చేసారు . ఈ విషయాన్ని మేజర్ టీమ్ పేర్కోంటూ కరోనా పాండెమిక్ తర్వాత అత్యంత తక్కువ ధరలతో మేజర్ విడుదలవుతోందని సోషల్ మీడియాలో ద్వారా ప్రకటించారు. ఇక మేజర్ సినిమా జూన్ 3న విడుదలవుతోంది. అడవి శేష్ సరసన సయి మంజ్రేకర్ హీరోయిన్ గా ప్రకాశం రాజ్, శోభిత ధూళిపాళ్ళ, రేవతి ప్రధానపాత్రాలలో నటించారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago