చెల్లెలి పై ఉన్న ప్రేమతో.. ఆమెకి తాళిని దూరం చేసిన అన్న?

ఆపదలు చెల్లెకు అండగా ఉంటానని మాట ఇచ్చిన అన్న చెల్లెలు క్షేమం కోసం ఈ దారుణానికి పాల్పడ్డాడు. తన చెల్లెలు క్షేమంగా ఉండాలని ఏకంగా ఆమెకు తన పసుపు కుంకుమలను దూరం చేశాడు. చెల్లెళ్లను తన భర్త హింసిస్తున్నాడు అని తెలుసుకొన్న అన్న ఆవేశంతో ఏకంగా తన భావను హత్య చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు…

నెల్లూరులోని నవాబుపేట ఏరియాకి చెందిన సునీల్‌కి శైలజతో సుమారు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కొన్ని సంవత్సరాల పాటు వీరి కాపురం సజావుగా సాగిన తరువాత సునీల్ తరచూ మద్యం తాగి వచ్చి తన భార్యతో తరచు గొడవ పడేవాడు. కొన్నిసార్లు సునీల్ మితి మీరి ప్రవర్తించి శైలజ పై దాడి చేసే వాడు. ఈ క్రమంలోని శైలజ అన్న ఎలాగైనా తన బావకు బుద్ధి చెప్పాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ క్రమంలోనే పోలీసులు సునీల్ ను పిలిపించి అతడికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.తర్వాత కొద్ది రోజులు మంచిగా ఉన్న సునీల్ ఆ తర్వాత యధావిధిగా తాగి వచ్చి తన భార్యను చితకబాది వాడు.ఈ విధంగా తన చెల్లెళ్లను రోజు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుండడంతో శైలజా అన్న రాజు ఇక తన బావ నుంచి తన చెల్లెలుకు విముక్తి కల్పించాలని భావించాడు. ఈ క్రమంలోనే తన స్నేహితులతో కలిసి తన భావ సునీల్ ను అతి కిరాతకంగా చంపివేశాడు. అయితే ఈ హత్య కేసులో నిందితుడు సునీల్ ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.