కొన్నిసార్లు మానవతా దృక్పథంతో ప్రమాదం నుంచి ఇతరులను కాపాడే ప్రయత్నంలో వారి ప్రాణాలను కోల్పోతుంటారు.ఈ విధంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలను గురించి మనం వినే ఉంటాం. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి గుజరాత్ లో చోటు చేసుకుంది. ఒక మేకను సింహం నుంచి కాపాడబోయి ఆ వ్యక్తి సింహానికి బలయ్యాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
గుజరాత్ రాష్ట్రంలోని జూనాగఢ్ జిల్లాలోని తలాలా అటవీ రేంజ్ పరిధిలో మధుపూరు గ్రామంలో నివసించే బహదూర్భాయ్ జీవాభాయ్ (35)మామిడి తోటకు కాపలాగా ఉండేవాడు. రోజు మాదిరిగానే శుక్రవారం రాత్రి కూడా మామిడి తోట కాపలాకు వెళ్ళాడు. శనివారం తెల్లవారుజామున అడవి నుంచి ఒక సింహం బయటకు రావడంతో ఆ తోటలో ఉన్న మేక గట్టిగా అరవడం మొదలు పెట్టింది.
మేక అరుపులకు మేల్కొన్న జీవా బాయ్ సింహం నుంచి మేకను తప్పించాలనే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే మేకను తప్పించబోయి జీవాభాయ్ సింహానికి దొరికాడు.సింహం జీవాభాయ్పై పంజా విసిరి చంపి తినింది. సింహం తనపై దాడి చేస్తున్నప్పుడు గట్టిగా జీవా బాయ్ అరవడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు.
జీవా బాయ్ పై సింహం దాడి చేయటం చూసిన స్థానికులు ఈ విషయాన్ని వెంటనే అటవీశాఖ అధికారులకు తెలియజేశారు. దీంతో అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని సింహాన్ని బంధించి అడవిలోకి తీసుకెళ్లారు. అప్పటికే సింహం దాడిలో జీవా బాయ్ దారుణంగా చనిపోయాడు.
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…
సినిమా రంగంలో అవకాశాలు పొందడం మాత్రమే కాదు, వాటిని నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టమైన విషయం. ఈ ప్రయాణంలో ఎదురయ్యే…
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతున్న వేళ, ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ ఓటు హక్కు…
మైక్రో ఫైనాన్స్ పేరిట వెలుగులోకి వచ్చిన ఆర్థిక మోసం కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో పలువురిపై…
తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని సినిమాల విజయాల వెనుక ఆసక్తికర కథలు దాగి ఉంటాయి. అలాంటి సంఘటనల్లో ఒకటి హలో…
తెలుగు గాన రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గీతా మాధురి తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా…