General News

స్నేహితుడి భార్యతో చనువు పెంచుకున్నాడని.. ప్లాన్ ప్రకారం హత్య..!

వాళ్లంతా చిన్ననాటి స్నేహితులు. ఎలాంటి కష్టం వచ్చినా చెప్పుకొని తీర్చుకునే వారు. కానీ అందులో ఒకడు తన భార్యతో చనువుగా ఉంటున్నాడని స్నేహితుడిని హత్య చేసిన సంఘటనలో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటన యదాద్రి భువనగిరి జిల్లాలోని ఆత్మకూరు(ఎం) మండలంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను డీసీపీ నారాయణరెడ్డి బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆత్మకూరం మండలం కొరటికల్‌ గ్రామానికి చెందిన పెద్దిటి అశోక్‌రెడ్డి 2012లో అదే మండలం మోదుగగూడెం గ్రామానికి చెందిన శిరీషను కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నాడు.

అశోక్‌రెడ్డికి బండ సురేష్‌, చిన్నం అర్జున, లగ్గాల రవి, నిషాంతరెడ్డి, రుషిసాయి బాల్యమిత్రులు. మొదటి నుంచి వీళ్లంతా కలిసి ఉండేవారు. చిన్ని చిన్న కారణాల వల్ల వాళ్ల స్నేహితుల్లో చిన్నం అర్జున(34), ఆయన భార్య మధ్య విడాకుల కేసు నడుస్తోంది. అయితే ఈ కేసులో వాయిదాలకు వెళ్లాలంటే కొన్ని కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చేది. అయితే ఇలా వాయిదాలకు అశోక్‌రెడ్డి కారులోనే అతడు వెళ్లేవాడు. ఈ క్రమంలో తన భార్యతో అర్జున చనువుగా మాట్లాడడం చూసి అనుమానం పెంచుకున్న అశోక్‌రెడ్డి అతడితో మాట్లాడటం మానేశాడు.

అయినప్పటికీ అతనిలో మరింత అనుమానం పెరిగింది. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని పగ పెంచుకున్నాడు. అర్జునను హత్య చేయాలని మరో స్నేహితుడు బండ సురేశ్ తో కలిసి ప్రణాళిక రూపొందించాడు. అర్జునను చంపేందుకు సా యం చేయాలని కోరగా మామ ఉడుత నర్సింహ, బావమరిది నవీన ఒప్పుకున్నారు. ఈ మేరకు పలుమార్లు రెక్కీ నిర్వహించారు. ఈ క్రమంలో ఈ నెల 14వ తేదీ రాత్రి బండ సురేష్‌ అర్జున వద్దకు వెళ్లి మద్యం తాగుదాం రా అంటూ అశోక్‌రెడ్డి షెడ్‌కు తీసుకెళ్లాడు. వెంటనే అశోక్‌రెడ్డి, సురేష్‌, శిరీష, నర్సిం హ, నవీనతో పాటు మల్లేపూల శ్రీశైలం బైకులపై వస్తుండటంతో అతడికి అనుమానం వచ్చింది. అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. సురేశ్ అతడిని అడ్డగించి పట్టుకున్నాడు.

వెంటనే అర్జునపై అశోక్ రెడ్డి, సురేష్ కూర్చొని విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు. అతడు చనిపోయాడని నిర్ణయించుకున్న తర్వాత అక్కడ నుంచి పారిపోయారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు రామన్నపేట సీఐ మోతిరాం పర్యవేక్ష ణలో ఆత్మకూర్‌ ఎస్సై మధు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మకూర్‌ మండలంలోని తిమ్మాపురం చౌరస్తా వద్ద బుధవారం అనుమానాస్పదంగా సంచరిస్తున్న అశోక్‌రెడ్డి, బండి సురేష్‌, శిరీష, నవీన, శ్రీశైలాన్ని అదుపులోకి తీసుకొని విచారించగా హత్యచేసిన నిజాన్ని ఒప్పుకున్నారు. న్యాయమూర్తి ఆదేశం మేరకు వారిని రిమాండ్‌కు తరలించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

దాహం తీర్చుకుంటున్నాం అనుకుంటే.. ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నామా?

వేసవి వేడి రోజురోజుకీ పెరుగుతోంది. ఎండ తీవ్రతతో బయటకు వెళ్లడం కూడా కష్టంగా మారుతున్న వేళ, చల్లదనాన్ని కోసం చాలా…

8 minutes ago

కుదుళ్లు బలంగా… జుట్టు ఘనంగా! ఇంటి చిట్కాలతోనే పరిష్కారం!

ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…

13 hours ago

విజయవాడలో అపరాజిత దేవి మహిమ… దర్శిస్తే విజయం ఖాయం అంటున్న భక్తులు!

ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…

13 hours ago

ధనిక వ్యాపారి నుంచి భక్తి యోగి… పురందరదాసు జీవితం స్ఫూర్తిదాయకం!

భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…

13 hours ago

రోజూ ఒక గ్లాస్ తాగండి… జీర్ణక్రియ నుంచి గుండె వరకూ ఫుల్ ప్రొటెక్షన్!

మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…

13 hours ago

కుటుంబ సుఖశాంతుల కోసం సీతా నవమి పూజ ఎందుకు ముఖ్యమో తెలుసా?

హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…

13 hours ago