General News

స్నేహితుడి భార్యతో చనువు పెంచుకున్నాడని.. ప్లాన్ ప్రకారం హత్య..!

వాళ్లంతా చిన్ననాటి స్నేహితులు. ఎలాంటి కష్టం వచ్చినా చెప్పుకొని తీర్చుకునే వారు. కానీ అందులో ఒకడు తన భార్యతో చనువుగా ఉంటున్నాడని స్నేహితుడిని హత్య చేసిన సంఘటనలో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటన యదాద్రి భువనగిరి జిల్లాలోని ఆత్మకూరు(ఎం) మండలంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను డీసీపీ నారాయణరెడ్డి బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆత్మకూరం మండలం కొరటికల్‌ గ్రామానికి చెందిన పెద్దిటి అశోక్‌రెడ్డి 2012లో అదే మండలం మోదుగగూడెం గ్రామానికి చెందిన శిరీషను కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నాడు.

అశోక్‌రెడ్డికి బండ సురేష్‌, చిన్నం అర్జున, లగ్గాల రవి, నిషాంతరెడ్డి, రుషిసాయి బాల్యమిత్రులు. మొదటి నుంచి వీళ్లంతా కలిసి ఉండేవారు. చిన్ని చిన్న కారణాల వల్ల వాళ్ల స్నేహితుల్లో చిన్నం అర్జున(34), ఆయన భార్య మధ్య విడాకుల కేసు నడుస్తోంది. అయితే ఈ కేసులో వాయిదాలకు వెళ్లాలంటే కొన్ని కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చేది. అయితే ఇలా వాయిదాలకు అశోక్‌రెడ్డి కారులోనే అతడు వెళ్లేవాడు. ఈ క్రమంలో తన భార్యతో అర్జున చనువుగా మాట్లాడడం చూసి అనుమానం పెంచుకున్న అశోక్‌రెడ్డి అతడితో మాట్లాడటం మానేశాడు.

అయినప్పటికీ అతనిలో మరింత అనుమానం పెరిగింది. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని పగ పెంచుకున్నాడు. అర్జునను హత్య చేయాలని మరో స్నేహితుడు బండ సురేశ్ తో కలిసి ప్రణాళిక రూపొందించాడు. అర్జునను చంపేందుకు సా యం చేయాలని కోరగా మామ ఉడుత నర్సింహ, బావమరిది నవీన ఒప్పుకున్నారు. ఈ మేరకు పలుమార్లు రెక్కీ నిర్వహించారు. ఈ క్రమంలో ఈ నెల 14వ తేదీ రాత్రి బండ సురేష్‌ అర్జున వద్దకు వెళ్లి మద్యం తాగుదాం రా అంటూ అశోక్‌రెడ్డి షెడ్‌కు తీసుకెళ్లాడు. వెంటనే అశోక్‌రెడ్డి, సురేష్‌, శిరీష, నర్సిం హ, నవీనతో పాటు మల్లేపూల శ్రీశైలం బైకులపై వస్తుండటంతో అతడికి అనుమానం వచ్చింది. అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. సురేశ్ అతడిని అడ్డగించి పట్టుకున్నాడు.

వెంటనే అర్జునపై అశోక్ రెడ్డి, సురేష్ కూర్చొని విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు. అతడు చనిపోయాడని నిర్ణయించుకున్న తర్వాత అక్కడ నుంచి పారిపోయారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు రామన్నపేట సీఐ మోతిరాం పర్యవేక్ష ణలో ఆత్మకూర్‌ ఎస్సై మధు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మకూర్‌ మండలంలోని తిమ్మాపురం చౌరస్తా వద్ద బుధవారం అనుమానాస్పదంగా సంచరిస్తున్న అశోక్‌రెడ్డి, బండి సురేష్‌, శిరీష, నవీన, శ్రీశైలాన్ని అదుపులోకి తీసుకొని విచారించగా హత్యచేసిన నిజాన్ని ఒప్పుకున్నారు. న్యాయమూర్తి ఆదేశం మేరకు వారిని రిమాండ్‌కు తరలించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

9 hours ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

9 hours ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

9 hours ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

10 hours ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

10 hours ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

10 hours ago