General News

స్నేహితుడి భార్యతో చనువు పెంచుకున్నాడని.. ప్లాన్ ప్రకారం హత్య..!

వాళ్లంతా చిన్ననాటి స్నేహితులు. ఎలాంటి కష్టం వచ్చినా చెప్పుకొని తీర్చుకునే వారు. కానీ అందులో ఒకడు తన భార్యతో చనువుగా ఉంటున్నాడని స్నేహితుడిని హత్య చేసిన సంఘటనలో పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. ఈ ఘటన యదాద్రి భువనగిరి జిల్లాలోని ఆత్మకూరు(ఎం) మండలంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను డీసీపీ నారాయణరెడ్డి బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ఆత్మకూరం మండలం కొరటికల్‌ గ్రామానికి చెందిన పెద్దిటి అశోక్‌రెడ్డి 2012లో అదే మండలం మోదుగగూడెం గ్రామానికి చెందిన శిరీషను కులాంతర ప్రేమ వివాహం చేసుకున్నాడు.

అశోక్‌రెడ్డికి బండ సురేష్‌, చిన్నం అర్జున, లగ్గాల రవి, నిషాంతరెడ్డి, రుషిసాయి బాల్యమిత్రులు. మొదటి నుంచి వీళ్లంతా కలిసి ఉండేవారు. చిన్ని చిన్న కారణాల వల్ల వాళ్ల స్నేహితుల్లో చిన్నం అర్జున(34), ఆయన భార్య మధ్య విడాకుల కేసు నడుస్తోంది. అయితే ఈ కేసులో వాయిదాలకు వెళ్లాలంటే కొన్ని కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చేది. అయితే ఇలా వాయిదాలకు అశోక్‌రెడ్డి కారులోనే అతడు వెళ్లేవాడు. ఈ క్రమంలో తన భార్యతో అర్జున చనువుగా మాట్లాడడం చూసి అనుమానం పెంచుకున్న అశోక్‌రెడ్డి అతడితో మాట్లాడటం మానేశాడు.

అయినప్పటికీ అతనిలో మరింత అనుమానం పెరిగింది. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఉందని పగ పెంచుకున్నాడు. అర్జునను హత్య చేయాలని మరో స్నేహితుడు బండ సురేశ్ తో కలిసి ప్రణాళిక రూపొందించాడు. అర్జునను చంపేందుకు సా యం చేయాలని కోరగా మామ ఉడుత నర్సింహ, బావమరిది నవీన ఒప్పుకున్నారు. ఈ మేరకు పలుమార్లు రెక్కీ నిర్వహించారు. ఈ క్రమంలో ఈ నెల 14వ తేదీ రాత్రి బండ సురేష్‌ అర్జున వద్దకు వెళ్లి మద్యం తాగుదాం రా అంటూ అశోక్‌రెడ్డి షెడ్‌కు తీసుకెళ్లాడు. వెంటనే అశోక్‌రెడ్డి, సురేష్‌, శిరీష, నర్సిం హ, నవీనతో పాటు మల్లేపూల శ్రీశైలం బైకులపై వస్తుండటంతో అతడికి అనుమానం వచ్చింది. అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. సురేశ్ అతడిని అడ్డగించి పట్టుకున్నాడు.

వెంటనే అర్జునపై అశోక్ రెడ్డి, సురేష్ కూర్చొని విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు. అతడు చనిపోయాడని నిర్ణయించుకున్న తర్వాత అక్కడ నుంచి పారిపోయారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు రామన్నపేట సీఐ మోతిరాం పర్యవేక్ష ణలో ఆత్మకూర్‌ ఎస్సై మధు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆత్మకూర్‌ మండలంలోని తిమ్మాపురం చౌరస్తా వద్ద బుధవారం అనుమానాస్పదంగా సంచరిస్తున్న అశోక్‌రెడ్డి, బండి సురేష్‌, శిరీష, నవీన, శ్రీశైలాన్ని అదుపులోకి తీసుకొని విచారించగా హత్యచేసిన నిజాన్ని ఒప్పుకున్నారు. న్యాయమూర్తి ఆదేశం మేరకు వారిని రిమాండ్‌కు తరలించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రూ. 60 కోట్లు పెట్టినా ప్రయోజనం లేదు.. జట్లను ముంచేస్తున్న ముగ్గురు ఆటగాళ్లు

ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠగా సాగుతున్నా, కొందరు స్టార్ ఆటగాళ్ల వైఫల్యం ఫ్రాంచైజీలను ఆందోళనలోకి నెట్టింది. భారీ ధరలకు కొనుగోలు…

3 minutes ago

రాజా రవీంద్ర ఫ్యామిలీ ఫోటోలు వైరల్.. మనవళ్లు చూస్తే మురిసిపోతారు

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…

12 hours ago

గ్యాస్ రాలేదు.. కానీ డెలివరీ మెసేజ్ వచ్చింది! వినియోగదారుడికి షాక్

వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…

12 hours ago

‘పాపం ప్రతాప్‌’ రివ్యూ.. కొత్త కథ, కానీ కుదరని ప్రయత్నం

తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్‌’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…

12 hours ago

జేడీ చక్రవర్తి భార్య గురించి షాకింగ్ నిజం.. తెలుగులోనే హీరోయిన్..!

తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…

12 hours ago

“మహిళల ఉసురు తగులుతుంది”.. అమిత్ షా ఫైర్‌తో రాజకీయాల్లో హీట్

లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…

12 hours ago