ముస్లింల పవిత్ర స్థలమైన సౌదీ అరేబియాలోని మక్కా మసీదులోకి ఒక కారు దూసుకు వెళ్ళిన ఘటన తాజాగా చోటు చేసుకుంది. ఎంతో వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి మసీదు లోకి దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం 10:25 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు అధికారులు తెలియజేశారు.
ఎంత వేగంగా వస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి మసీదు బయట వైపు ప్రాంగణంలో నిర్మించిన భారీ గేట్లను ఢీ కొట్టుకొని వెళ్ళింది. ఈ విషయం గమనించిన భద్రతా సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని డ్రైవర్ ప్రాణాలను రక్షించారు. అయితే ఆ డ్రైవర్ ఎవరు, అతని పేరు ఏమిటి అన్న విషయాలను గురించి అధికారులు తెలియజేయలేదు. కానీ ఆ డ్రైవర్ సౌదీ అరేబియా పౌరుడు అని మాత్రం అధికారులు తెలియజేశారు.
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రముఖ ఆలయాలన్నీ మూతపడ్డాయి. ఈ నేపథ్యంలోనే సౌదీఅరేబియాలోని ఎంతో పవిత్రమైన మక్కా మసీదు కూడా మూత పడింది. లాక్ డౌన్ నిబంధనలు సడలింపు అనంతరం ఏడు నెలల తర్వాత తెరుచుకున్న మక్కామసీదు ప్రస్తుతం భక్తుల సందర్శనార్థం కరోనా జాగ్రత్తలను పాటిస్తూ15 వేలమంది సందర్శనార్థం భక్తులకు అవకాశం కల్పించారు. ఈ కారు ప్రమాదం జరిగినప్పుడు బయట భక్తులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలియజేశారు.
కారు అంత వేగంగా రావడానికి గల కారణం డ్రైవర్ మానసిక పరిస్థితి బాగా లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ లలో రికార్డ్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఈ ఘటనపై స్పందిస్తూ అక్కడ ఎవరు భక్తులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…