ప్రతి ఒక్కరి జీవితంలోనూ పెళ్లి అనేది ఎంతో అపురూపమైన వేడుక. ఈ వివాహ వేడుక ద్వారా ఇద్దరి జీవితాలు మూడుముళ్ల బంధంతో ఒకటవుతారు. ఈ విధంగా మూడుముళ్ల బంధం ద్వారా ఒకటైన ఈ జంట తాను జీవితాంతం ఒకరికి ఒకరు తోడుగా ఉంటామని, ఎలాంటి కష్ట సుఖాలలో అయినా పాలుపంచుకుంటామని వరుడు అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి వధువు మెడలో తాళి కడతాడు. ఈ విధంగా వివాహం జరిగిన తర్వాత భార్య భర్తల జీవితం ఎంతో అన్యోన్యంగా ఉండాలంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటూ జీవితంలో ముందుకు సాగిపోవాలి.
ఈ నేపథ్యంలోనే అమెరికాకు చెందిన ఓ జంట విషయంలో మాత్రం ఇలా జరగలేదు. పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్త ఒక ఒక వింత వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి కారణంగా తాను మూడు ముళ్లు వేసిన భార్యని గుర్తు పట్టలేకపోయాడు. అసలు తనకు పెళ్లి జరిగిందనే విషయాన్ని కూడా మరిచిపోయాడు. కానీ ఇక్కడే ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉంది. తనకి పెళ్ళి జరిగిందనే విషయం మర్చిపోయిన ఆ వ్యక్తి తిరిగి తన భార్యకే లవ్ ప్రపోస్ చేయడం గమనార్హం.
మతిమరుపు వ్యాధితో బాధ పడుతున్న ఆ వ్యక్తి తన జ్ఞాపక శక్తిని కోల్పోయిన తన భార్య పై ఉన్న ప్రేమ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. తన భార్యను గుర్తుపట్టలేని స్థాయిలో ఉన్నప్పటికీ తిరిగి తనని నన్ను పెళ్లి చేసుకుంటావా ?అని అడగడంతో అందుకు ఆ మహిళ ఎస్ అని చెప్పిన ఘటన అమెరికాలోని కనెక్టికట్లో చోటుచేసుకుంది. 56 ఏళ్ల పీటర్ మార్షల్ పన్నెండేళ్ల కిందట లీసాను పెళ్లి చేసుకున్నాడు. అయితే, పెళ్లయిన కొన్నేళ్లలోనే అతడు మతిమరుపు వ్యాధితో బాధపడ్డాడు.
ఈ క్రమంలోనే లీసా తన భర్తకు గతం గుర్తు చేయడానికి తనకు పెళ్లి జరిగిన సమయంలో తీసిన వీడియోను చూపించింది. అయినప్పటికీ తనకి గతం ఏ మాత్రం గుర్తుకు రాకపోగా మనం ఈటీవీలో మాదిరిగానే పెళ్లి చేసుకుందామా అని అడగగా అందుకు పీటర్ ఒప్పుకొన్నారు. ఈ విధంగా తన జీవితంలో రెండో సారి తన భర్తతోనే వివాహం చేసుకోవడం తనకెంతో ఆనందంగా ఉందని, వీరి పెళ్లిని తన కూతురి దగ్గరుండి ఎంతో ఘనంగా జరిపించింది. ఈ విధంగా పీటర్ పెళ్లికి ఒప్పుకోవడంతో అతడు జ్ఞాపకశక్తిని కోల్పోయినా తన మీద ప్రేమ తగ్గలేదని, ఇప్పటికే అతడికి తానంటేనే ఇష్టమని ఆమె మురిసిపోయింది.
ఆంధ్రప్రదేశ్లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…