Manchu Mohan Babu: టాలీవుడ్ రెబల్ కృష్ణంరాజు మరణించడంతో సినీ ప్రపంచం ఓ గొప్ప నటుడిని కోల్పోయిందని, ఆయన లేని లోటు ఎవరు పోర్చలేరు అంటూ పలువురు సినీ ప్రముఖులు కృష్ణంరాజు సినిమా పరిశ్రమకు చేసిన సేవలను కొనియాడారు.1966లో చిలుక గోరింక సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన తన తుది శ్వాస వదిలే వరకు సినిమాలలో నటిస్తూ చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు అందించారు.
ఇలా చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కృష్ణంరాజు ఆదివారం మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈయన మరణించడంతో మంగళవారం ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ లో సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు, మంచు విష్ణు, సి కళ్యాణ్, జీవిత, తమ్మారెడ్డి భరద్వాజ్ వంటి తదితరులు పాల్గొన్నారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మంచు మోహన్ బాబు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.తన ఆత్మీయులు ఎంతోమంది అనంత లోకాలకు వెళ్లిన ఎప్పుడు సంతాప సభలో పాల్గొనలేదని మొదటిసారి ఈ సభలో పాల్గొనడం జరిగింది అంటూ ఈయన ఎమోషనల్ అయ్యారు. ఇక కృష్ణంరాజుతో తనకున్న అనుబంధం గురించి మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు.
నన్ను ఇండస్ట్రీలో నోరారా అరేయ్ అంటూ పిలిచే ఏకైక వ్యక్తి కృష్ణంరాజు గారు. అలాగే తనని మొట్టమొదటిసారి బెంజ్ కార్ ఎక్కించినది కూడా ఈయనే అంటూ మోహన్ బాబు కృష్ణంరాజు గురించి తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. కృష్ణంరాజు గారు ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని సకల దేవతలను కోరుకుంటున్నా అంటూ ఈ సందర్భంగా మోహన్ బాబు కృష్ణంరాజు సంతాపసభలో ఎమోషనల్ అవుతూ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…