Manchu Mohan Babu: టాలీవుడ్ రెబల్ కృష్ణంరాజు మరణించడంతో సినీ ప్రపంచం ఓ గొప్ప నటుడిని కోల్పోయిందని, ఆయన లేని లోటు ఎవరు పోర్చలేరు అంటూ పలువురు సినీ ప్రముఖులు కృష్ణంరాజు సినిమా పరిశ్రమకు చేసిన సేవలను కొనియాడారు.1966లో చిలుక గోరింక సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన ఈయన తన తుది శ్వాస వదిలే వరకు సినిమాలలో నటిస్తూ చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు అందించారు.
ఇలా చిత్ర పరిశ్రమలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కృష్ణంరాజు ఆదివారం మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈయన మరణించడంతో మంగళవారం ఫిలింనగర్ కల్చరల్ క్లబ్ లో సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు, మంచు విష్ణు, సి కళ్యాణ్, జీవిత, తమ్మారెడ్డి భరద్వాజ్ వంటి తదితరులు పాల్గొన్నారు.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మంచు మోహన్ బాబు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.తన ఆత్మీయులు ఎంతోమంది అనంత లోకాలకు వెళ్లిన ఎప్పుడు సంతాప సభలో పాల్గొనలేదని మొదటిసారి ఈ సభలో పాల్గొనడం జరిగింది అంటూ ఈయన ఎమోషనల్ అయ్యారు. ఇక కృష్ణంరాజుతో తనకున్న అనుబంధం గురించి మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు.
నన్ను ఇండస్ట్రీలో నోరారా అరేయ్ అంటూ పిలిచే ఏకైక వ్యక్తి కృష్ణంరాజు గారు. అలాగే తనని మొట్టమొదటిసారి బెంజ్ కార్ ఎక్కించినది కూడా ఈయనే అంటూ మోహన్ బాబు కృష్ణంరాజు గురించి తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. కృష్ణంరాజు గారు ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలని సకల దేవతలను కోరుకుంటున్నా అంటూ ఈ సందర్భంగా మోహన్ బాబు కృష్ణంరాజు సంతాపసభలో ఎమోషనల్ అవుతూ చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…