Krishnam Raju: టాలీవుడ్ రెబల్ కృష్ణంరాజు పోస్ట్ కోవిడ్ సమస్యలతో మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. ఈయన గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాదులోని ఏఐజి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉన్నారు. అయితే ఈయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున ఆసుపత్రిలో మృతి చెందారు.
ఇలా కృష్ణంరాజు మరణించారన్న వార్త తెలియగానే చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయనతో పలువురు సినీ ప్రముఖులు తమకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ ఆయనకు నివాళులు అర్పించారు.ఇకపోతే గతంలో కృష్ణంరాజు పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే కృష్ణంరాజు గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొనీ ఒక విషయంలో తాను ఎప్పటికీ రిచ్ అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. కృష్ణంరాజు ఎంతో సంపన్నుల కుటుంబంలో జన్మించారు. అయితే తాను ఆస్తులు విషయంలో రిచ్ కాదని మనసు విషయంలో చాలా రిచ్ అంటూ గతంలో కృష్ణంరాజు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.తాను సినిమాలలో సంపాదించినది మొత్తం దాచి పెట్టకుండా ఎక్కువ భాగం ఖర్చులు చేసే వాణ్ణి అంటూ ఈయన తెలిపారు.
తాను ఇంటి నుంచి స్టూడియోకు వెళ్లే వరకు మాత్రమే కృష్ణంరాజు ఒకసారి మేకప్ వేసుకున్నాను అంటే ఈ ప్రపంచంతో తనకు పని ఉండదని ఈయన తెలిపారు. ఇక తనకు పేకాట ఆడడం, మందు కొట్టడం కూడా అలవాటుగానే ఉన్నాయని అయితే ఎప్పుడూ కూడా లిమిట్ దాటదు అంటూ ఈయన వెల్లడించారు.ఇలా ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు వ్యాపారాలలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టామని అయితే లాభనష్టాలు గురించి ఆలోచించుకోకుండా వ్యాపారాలు చేస్తూ ఉండేవాడిని అంటూ గతంలో కృష్ణంరాజు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…