Manchu Vishnu Kids: సినిమాలలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్న మంచు వారసురాలు.. క్లారిటీ ఇచ్చిన విష్ణు!

Manchu Vishnu Kids: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు కుటుంబానికి కూడా ఎంతో మంచి క్రేజ్ ఉంది.మోహన్ బాబు వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు విష్ణు ,మనోజ్, లక్ష్మీ ప్రసన్న.అయితే ఇండస్ట్రీలో ఈ ముగ్గురు అనుకున్న స్థాయిలో హిట్ సాధించలేకపోయినా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగానే ఉన్నారు.

ఇక తాజాగా మంచు విష్ణు నటించిన చిత్రం జిన్నా.ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 21వ తేదీ విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హైదరాబాదులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో ఘనంగా నిర్వహించిన విషయం మనకు తెలిసిందే.

ఇక ఈ వేడుకలో భాగంగా మంచు విష్ణు మాట్లాడుతూ తన కూతుర్లను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నానని వెల్లడించారు. ఇప్పటికే అరియనా, విరియనా జిన్నా సినిమాలో ఒక పాట పాడారని వీరి చేత అనూప్ రూబెన్స్ అద్భుతమైన పాటను పాటించారంటూ విష్ణు సంగీత దర్శకుడుకి కృతజ్ఞతలు తెలియజేశారు.

Manchu Vishnu Kids: నాన్నలో ఆ విషయం నచ్చదు..

ఇక ఇప్పటికే అరియనా ,వివియానా పేరుతో తమ సొంత బ్యానర్ లో సినిమాలో కూడా నిర్మిస్తున్న విషయం తెలిసిందేనని విష్ణు తెలిపారు. ఇక ఈ సినిమాలో తన కూతుర్లు కూడా ఒక చిన్న పాత్రలో కనిపించబోతున్నారని విష్ణు ఈ సందర్భంగా తన కూతుర్ల ఎంట్రీ గురించి తెలియజేశారు.ఇక ఈ కార్యక్రమంలో విష్ణు మాట్లాడుతూ తన తండ్రిగారిలో తనకు నచ్చని విషయం ఏదైనా ఉంది అంటే అది కేవలం తన నాన్న గారి కోపమంటూ షాకింగ్ కామెంట్ చేశారు.