Sudheer Babu: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు ఇద్దరు హీరోలు ఒకే టైటిల్ తో సినిమాలను చేస్తుంటారు. అయితే ఆ సినిమా టైటిల్ పోస్టర్ విడుదలైనప్పుడు పెద్ద ఎత్తున వివాదాలకు కారణం అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వివాదంలో చిక్కుకున్నారు నటుడు సుధీర్ బాబు.
సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వి. ఆనంద ప్రసాద్ నిర్మాణంలో ‘హంట్’ అనే థ్రిల్లర్ మూవీ షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ క్రమంలోని ఈ సినిమా టైటిల్ పోస్టర్ ప్రకటించడంతో పెద్ద ఎత్తున వివాదంలో చిక్కుకుంది. ఇకపోతే శ్రీ క్రియేషన్స్’ పతాకం పై నిక్షిత్ హీరోగా, దర్శకుడిగా… నర్సింగ్ రావు నిర్మాతగా ‘హంట్’ పేరుతో మరో సినిమా కూడా రూపొందుతుంది. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే మోషన్ పోస్టర్ కూడా విడుదల చేశారు.
ఈ క్రమంలోనే శ్రీ క్రియేషన్స్ బ్యానర్ ఈ విషయంపై స్పందిస్తూ మేము ఈ సినిమా టైటిల్ ఫిలిం ఛాంబర్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఆరు నెలలు అయింది. అదే విధంగా ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్ కూడా విడుదల చేసాము. ఇలా మా సినిమాకు రిజిస్టర్ చేసుకున్న టైటిల్ భవ్య క్రియేషన్స్ వారు ఎలా పెట్టుకుంటారు అంటూ ప్రశ్నించారు. ఇదే విషయమే ఫిలిం ఛాంబర్ లో కంప్లైంట్ చేసినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది అంటూ శ్రీ క్రియేషన్స్ నిర్మాత, దర్శకుడు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక ఈ విషయంపై శ్రీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న హంట్ సినిమా హీరో నిక్షిత్ మాట్లాడుతూ మేము ఆరు నెలల క్రితమే రిజిస్టర్ చేసుకున్న హంట్ సినిమా టైటిల్ ను ఎంతో రాయల్ గా భవ్య క్రియేషన్స్ వారు దొంగతనం చేశారు అంటూ ఆరోపించారు. ఈ విషయం పై ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేసిన మాకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు పూర్తిగా అన్యాయం జరిగింది అంటూ ఆరోపణలు చేశారు. మరి ఈ విషయం లో ఎవరు వెనక్కి తగ్గుతారనే విషయం తెలియాల్సి ఉంది.
మన దేశంలో చిన్నపిల్లల్లో తరచుగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్యల్లో రక్తహీనత ఒకటి. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లల్లో, అలాగే రెండు సంవత్సరాల…
2026 ఏప్రిల్ 15 బుధవారం రోజుకు సంబంధించిన రాశి ఫలితాలు ఈ రోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి…
గుజరాత్లోని సారంగపుర్ ప్రాంతంలో వెలసిన కష్టభంజన్ దేవ్ హనుమాన్ ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామి క్షేత్రాల్లో ఒకటి. భక్తులు…
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…