Marudhuri Raja : తెలుగు సినిమా పరిశ్రమలో దాదాపు 200 సినిమాలకు రైటర్ గా పనిచేసిన మారుధురి రాజా స్వస్థలం గుంటూరు. మొదటి సినిమా ఒంటరి పోరాటం నుండి రైటర్ గా ఎన్నో సినిమాలకు పని చేసారు. ఈవివి సత్యనారాయణ, ఎస్వి కృష్ణారెడ్డి, కే రాఘవేంద్రరావు వంటి దర్శకులకు ఎక్కువ సినిమాలు చేసిన రాజా తన అనుభవాలు దర్శకుడిగా చేసిన ప్రయత్నం ఎందుకు విఫలమైంది, నటుడుగా ఎందుకు రాలేదనే విషయాల గురించి స్పందించారు.
దాసరిగారు సినిమా చూడ్డానికి వచ్చి కొనాలనుకున్నారు….
మారుధురి రాజా అన్న హరనాథ రావు గారు డైరెక్టర్ గా సినిమా ఇండస్ట్రీ లో ఉండటం, చిన్నతనంలో స్టేజి ప్లే బ్యాక్స్ ఎన్నో రాసిన మారుధురి రాజా సినిమా ఇండస్ట్రీకి వచ్చి రైటర్ గా కెరీర్ మొదలుపెట్టారు. అయితే మధ్యలో సినిమా డైరెక్షన్ వైపు వెళ్లాలని అనుకున్నారు. ఇక సినిమాను తీసాక దాసరి నారాయణ రావు గారు వచ్చి సినిమా మొత్తం చూసి ఆయనకు నచ్చడంతో సినిమా కొనుక్కోవాలని అనుకున్నారు. ఇక ఈవిషయంలో సినిమా నిర్మాతకు, దాసరి గారికి కొన్ని షరతుల విషయంలో తేడాలు రావడంతో దాసరి గారికి సినిమాను అమ్మలేదు. దీంతో సినిమాకు దక్కాల్సిన ఫలితం రాలేదనిపించింది.
ఈ విషయంలో నిర్మాతకి కానీ, దాసరి గారిది కానీ తప్పు కాదు. నేను డిమాండ్ చేయలేను అదే నా అసమర్ధత. అలా నేను లేకుండా ఉండుంటే బాగుండేదని చాలా సార్లు అనిపించింది. ఇప్పటి దర్శకులు అలా లేరు, ఏదైనా నిర్మాతను డిమాండ్ చేసి వాళ్లకు కావాల్సింది తీసుకుంటారు. ఇప్పటి దర్శకులు కరెక్ట్ గా ఉన్నారు అంటూ వాఖ్యణించారు. ఇక సి కళ్యాణ్, దర్శకుడు వి వి వినాయక్ బావ అని పిలుస్తారని వివరించారు. ఇండస్ట్రీలో నాకు శిష్యులు లేరు అందరు బంధువులే అని చెప్పారు. మందు తాగడం వల్ల నా వ్యక్తిగత జీవితంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదంటూ వివరించారు.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…