దర్శకుడు మారుతి తన కొత్త సినిమా ప్రాజెక్ట్పై ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు. ‘ది రాజా సాబ్’ విడుదల తరువాత వచ్చిన ఫలితాల నుంచి పాఠాలు నేర్చుకున్న ఆయన, తదుపరి సినిమా ప్లానింగ్లో జాగ్రత్త చూపిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నారు. శ్రీరామనవమి సందర్భంగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఎమోషనల్ పోస్టులో, ప్రతి ప్రయాణం మనకు కొత్త పాఠాలను నేర్పుతుందని, కొత్త కథకు చివరి టచ్లు ఇస్తున్నారని తెలిపారు.
ప్రస్తుతం మారుతి కొత్త సినిమా స్క్రిప్ట్ను ఫైనల్ ఫేజ్లో ఉన్నట్లు తెలిపారు. ఈ సినిమా ఫుల్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతుందని టాక్. సరికొత్త ఎంటర్టైనర్తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఆయన ప్రధాన లక్ష్యమని తెలుస్తోంది. తనపై నమ్మకం ఉంచిన ప్రేక్షకులు, అభిమానులు, మీడియాకు ధన్యవాదాలు తెలిపారు. అయితే కొత్త సినిమా ‘ది రాజా సాబ్’ పార్ట్ 2 అవుతుందా లేక పూర్తి కొత్త కథా ఫ్రేమ్లో వేరే సినిమా అవుతుందా అని స్పష్టత ఇవ్వలేదు.
‘ది రాజా సాబ్’ సినిమా ప్రభాస్ హీరోగా వచ్చినప్పటికీ, హారర్ కామెడీగా వచ్చిన ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్లలో మంచి రికవరీ చూపినా, తర్వాత నెగటివ్ టాక్ కారణంగా బాక్సాఫీస్ వద్ద జోరు తగ్గిపోయింది. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా పై విపరీత ట్రోలింగ్ జరిగింది. మారుతి ఈ తప్పులు మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలనుకుంటున్నారని సమాచారం.
సినీ వర్గాల ప్రకారం, ఈసారి వచ్చే సంక్రాంతి సీజన్లో రిలీజ్కి సిద్ధం చేస్తున్న సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉండనుంది. ఇప్పటికే స్క్రిప్ట్ దాదాపు పూర్తయిందని, త్వరలో సినిమా వివరాలు అధికారికంగా ప్రకటించవచ్చని టాక్. కథకు ‘హ్యాపీ పొంగల్’ అనే టైటిల్ పెట్టే ఆలోచన ఉందని వినిపిస్తోంది.
హీరో విషయానికి వస్తే, ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే మెగా ఫ్యామిలీకి చెందిన హీరోతో సినిమా చేయాలని మారుతి ఆలోచిస్తున్నారని, కొన్ని వర్గాలు వరుణ్ తేజ్ పేరు కూడా వినిపిస్తోందని చెప్పాయి. వచ్చే సంక్రాంతి సీజన్లో మరల హిట్ కొట్టి, తప్పులపై దృష్టి పెట్టి, ప్రేక్షకులకు నవ్వులు పంచే సినిమా ఇవ్వాలని ఆయన సంకల్పం.
మొత్తానికి, ‘ది రాజా సాబ్’ తర్వాత మారుతి తీసుకునే కొత్త సినిమా ఆయన కెరీర్లో కీలకమైన ప్రాజెక్ట్గా మారబోతుంది. త్వరలో పూర్తి వివరాలు, అధికారిక అప్డేట్స్ షేర్ కానున్నాయి.
ప్రస్తుత కాలంలో చాలా మంది కష్టపడి పనిచేస్తున్నప్పటికీ, ఆర్థిక భారం, అప్పులు భారంగా మారడం కామన్ సమస్యగా మారింది. ఈ…
హైదరాబాదీలో ఆహార భద్రతపై గణనీయమైన ఆందోళన కలిగించే ఘట్టం వెలుగులోకి వచ్చింది. నగరంలోని అంబర్పేట్ ప్రాంతంలో ఉస్మానియా బిస్కెట్ల తయారీ…
ప్రస్తుతంలో పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు కారణంగా హర్మూజ్ జలసంధి వద్ద అంతరాయం ఏర్పడటం వలన పలు దేశాల్లో చమురు, గ్యాస్…
ఈసారి కామద ఏకాదశి మార్చి 29, ఆదివారం రోజున వస్తోంది. ఏకాదశి వ్రతం విశ్వ రక్షకుడైన శ్రీ విష్ణుమూర్తికి అంకితం…
వేసవి రాకముందే నీటి కొరతతో నగర ప్రాంతాల్లో ఎద్దడి పెరుగుతోంది. మున్సిపల్ వాటర్ సరఫరా తగ్గడంతో, ప్రజలు వాటర్ ట్యాంకర్లపై…
అనంతపురం జిల్లాలో సంచలనానికి దారితీసిన ఒక దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ…