Medico Preethi: మెడికో స్టూడెంట్ ప్రీతి మరణ వార్త రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. సీనియర్ విద్యార్థి వేధింపులను తాళలేక ప్రమాదకరమైన ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ప్రీతి గత ఐదు రోజులుగా హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఆదివారం సాయంత్రం కన్నుమూశారు.
అయితే ఈమె మరణం విషయంలో పెద్ద ఎత్తున హై డ్రామాలు నడిచాయని, కుట్రలు జరిగాయని, పలువురు ఆరోపణలు చేస్తున్నారు. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో పీజీ చదువుతున్నటువంటి ప్రీతి సీనియర్ వేధింపులను భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా ఐదు రోజుల పాటు మృత్యులతో పోరాడిన ఈమె మరణించిందని తెలియగానే ఒక్కసారిగా నిమ్స్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.
ఒకవైపు ప్రీతి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు గిరిజన సంఘాల నేతలు బిజెపి నాయకులు ఆసుపత్రి వాతావరణం ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అయితే ప్రీతి మరణ వార్తను ప్రకటించడానికి ముందే పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించడంతో ప్రీతి మరణం పై కొన్ని అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.
ఇక ప్రీతి మరణించడంతో విద్యార్థుల సైతం ఆందోళనకు దిగి నిందితులకు తప్పకుండా శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా నేడు విద్యాసంస్థలకు కూడా బంద్ ప్రకటించారు. ఇక ప్రీతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రి ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…