General News

Medico Preethi: గాంధీ ఆసుపత్రికి ప్రీతి మృతదేహం… ఆందోళనకు దిగిన విద్యార్థులు!

Medico Preethi: మెడికో స్టూడెంట్ ప్రీతి మరణ వార్త రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. సీనియర్ విద్యార్థి వేధింపులను తాళలేక ప్రమాదకరమైన ఇంజక్షన్ తీసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ప్రీతి గత ఐదు రోజులుగా హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఆదివారం సాయంత్రం కన్నుమూశారు.

అయితే ఈమె మరణం విషయంలో పెద్ద ఎత్తున హై డ్రామాలు నడిచాయని, కుట్రలు జరిగాయని, పలువురు ఆరోపణలు చేస్తున్నారు. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాలలో పీజీ చదువుతున్నటువంటి ప్రీతి సీనియర్ వేధింపులను భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా ఐదు రోజుల పాటు మృత్యులతో పోరాడిన ఈమె మరణించిందని తెలియగానే ఒక్కసారిగా నిమ్స్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

ఒకవైపు ప్రీతి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు గిరిజన సంఘాల నేతలు బిజెపి నాయకులు ఆసుపత్రి వాతావరణం ముందు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అయితే ప్రీతి మరణ వార్తను ప్రకటించడానికి ముందే పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించడంతో ప్రీతి మరణం పై కొన్ని అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.

Medico Preethi: విద్యాసంస్థలకు బంద్…

ఇక ప్రీతి మరణించడంతో విద్యార్థుల సైతం ఆందోళనకు దిగి నిందితులకు తప్పకుండా శిక్ష పడాలని డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా నేడు విద్యాసంస్థలకు కూడా బంద్ ప్రకటించారు. ఇక ప్రీతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రి ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago