మనలో చాలామందికి ఉన్నతమైన లక్ష్యాలు ఉంటాయి. ఆ లక్ష్యాలను సాధించాలనే ఉద్దేశంతో మనం నిరంతరం కృషి చేస్తూ ఉంటాం. అయితే కొన్ని సందర్భాల్లో వేర్వేరు కారణాల వల్ల తల్లిదండ్రుల నుంచి ప్రోత్సాహం లభించదు. ఆడపిల్లైతే పెళ్లి చేసి అత్తారింటికి పంపిస్తే తమ బాధ్యత తీరిపోతుందని భావించే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. అటు తల్లిదండ్రుల మాటను కాదనలేక, ఇటు లక్ష్యాన్ని వదులుకోలేక కొందరు యువతులు అనుభవించే నరకయాతన అంతాఇంతా కాదు.
అయితే ఒక యువతి మాత్రం తాను పెళ్లి చేసుకుంటే లక్ష్యాన్ని సాధించలేనని భయాందోళనకు గురైంది. తల్లిదండ్రులకు ఎంత నచ్చజెప్పినా తన మాట మాత్రం వినరని భావించింది. ఇంట్లో వాళ్లు పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకోవడంతో లక్ష్యాన్ని సాధించడం కోసం ఇంటి నుంచి పారిపోయింది. ఏడేళ్ల తర్వాత కలెక్టర్ గా ఎంపికై సొంతింటికి తిరిగి వచ్చింది. వినడానికి సినిమా స్టోరీలా ఉన్న ఈ స్టోరీ ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ కు చెందిన 28 సంవత్సరాల సంజురాణివర్మ అనే యువతి తల్లి 2013లో చనిపోయింది. దీంతో ఆమె తండ్రి పెళ్లి చేస్తే కూతురు బాధ్యత తీరిపోతుందని భావించాడు. అనుకున్నదే తడవుగా పెళ్లి సంబంధం చూశాడు. దీంతో సంజురాణివర్మ ఇంటి నుంచి పారిపోయింది. ఇంట్లో నుంచి పారిపోయిన సంజు పీజీ పూర్తి చేసి యూపీఎస్సీ పరీక్షలు రాసి కలెక్టర్ గా ఎంపికై నేటి యువతకు రోల్ మోడల్ గా నిలిచింది.
అయితే ఏడేళ్ల ప్రయాణంలో సంజు పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు. ఖర్చుల కొరకు ప్రైవేట్ ఉద్యోగం చేయడంతో పాటు పిల్లలకు ట్యూషన్లు కూడా చెప్పింది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లక్ష్యాన్ని సాధించడం కోసం వెనుకడుగు వేయకుండా శ్రమించింది. అమ్మాయిలకు స్వేచ్ఛను ఇస్తే వాళ్లు ఉన్నత స్థానాలకు ఎదుగుతారని…. అమ్మాయిలను చదువుకోనివ్వకుండా పెళ్లి పేరుతో ఒత్తిడి చేయడం సరికాదని పేర్కొంది.
సినీ నటి అషు రెడ్డి చుట్టూ తాజాగా పెద్ద వివాదం చెలరేగింది. పెళ్లి పేరుతో మోసం జరిగిందని ఆరోపిస్తూ ఒక…
సమోవా వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ వెయిట్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన యువ క్రీడాకారిణి బెల్లాన భార్గవి అద్భుత ప్రదర్శనతో అందరి…
వేసవి కాలంలో బయట నిలిపిన బైక్పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…
ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…