General News

ముస్లిం పేషేంట్ చెవిలో ఇస్లామిక్ ప్రార్థన.. హిందూ డాక్టర్ కు నెటిజెన్ల ఫిదా?

ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో వ్యాపిస్తున్న కరోనా మహమ్మారి మనుషుల మధ్య బంధాలను విడదీస్తూ బంధం అనే మాటకి అర్థాన్ని మార్చేసింది. అదేవిధంగా మరికొన్నిచోట్ల కొందరిలో దాగి ఉన్న మానవత్వాన్ని పరిమళింప చేస్తోంది. కరోనా కారణం వల్ల ఎంతో మంది పోలీసులు డాక్టర్లు వారిలో ఉన్న సేవా గుణాన్ని మానవత్వాన్ని ఈ క్లిష్ట పరిస్థితులలో చాటుకున్నారు.తాజాగా కేరళకు చెందిన ఓ వైద్యులు కులమతాలకతీతంగా మానవత్వంతో చేసిన ఓ పని పై ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాలలోకి వెళితే…

కేరళకు చెందిన డాక్టర్ రేఖ కృష్ణన్ అనే వైద్యురాలు హిందూ మతానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ కోవిడ్ బారినపడి చివరి నిమిషాలలో కొట్టుమిట్టాడుతున్న ఓ ముస్లిం బాధితురాలికి తన చెవిలో ఇస్లామిక్ ప్రార్థనలు వినిపించిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.పాలక్కాడ్ పట్టాంబిలోని సెవానా హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్​లో మే 17 న చోటుచేసుకున్న ఈ ఘటన చోటు చేసుకుంది.

బీవతు అనే 56 ఏళ్ల ముస్లిం మహిళ కరోనా బారిన పడటంతో ఆమెను చికిత్స నిమిత్తం సెవానా హాస్పిటల్​లో చేర్చారు. అయితే ఆమె పరిస్థితి విషమించడంతో ఆమెను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారం తనని చూడటానికి తన బంధువులకు అనుమతి లేదు. అయితే రోజురోజుకు ఆమె ఆరోగ్య పరిస్థితి దారుణంగా క్షీణించడంతో పాటు అవయవాలు స్పందించడం మానేశాయి.

ఈ క్రమంలోనే సదరు బాధితురాలిని వెంటిలేటర్​పై నుంచి తొలగించాలని నిర్ణయించారు. మరణం అంచులలో కొట్టుమిట్టాడుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఆమె పరిస్థితి దారుణంగా ఉన్న క్రమంలో అక్కడ డాక్టర్ రేఖ కృష్ణన్ విధులు నిర్వహిస్తున్నారు. ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉంటూ కొట్టుమిట్టాడుతున్న ఆమెకు చివరి నిమిషాల్లో కాస్త ఓదార్పును ఇవ్వడం కోసం డాక్టర్ రేఖ ఆమె చెవిలో ఇస్లామిక్ ప్రార్థనలను చదివారు.

ముస్లిం సంప్రదాయం ప్రకారం మరణించే వ్యక్తి చెవిదగ్గర
కలీమా ప్రార్థన పఠిస్తే వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని ప్రగాఢ విశ్వాసం. అందువల్ల రేఖ కృష్ణన్ బాధితురాలి చెవిలో కలీమా ప్రార్థన చదవడంతో సదరు మహిళ గట్టిగా శ్వాస తీసుకొని ప్రాణాలు వదిలింది. ఈ విషయంపై డాక్టర్ స్పందిస్తూ రోగి చివరి నిమిషాలలో తన కుటుంబ సభ్యులు ఎవరూ పక్కన లేకపోవడంతో ఆమెకు ఏదైనా సహాయం చేయాలనిపించడంతోనే ఈ విధంగా ప్రార్థన చేసినట్లు తెలిపారు. నేను హిందూ మతానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ యూఏఈలో పెరిగినందున నాకు ముస్లిం ప్రార్థనలు, పద్ధతులు అన్నింటిపై అవగాహన ఉంది. అందుకోసమే ఆమె చివరి ఘడియలలో ఈ విధంగా ప్రార్థనలో చేశానని తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

బ్రౌన్ షుగర్ నిజంగా హెల్తీనా? తెల్ల చక్కెరతో పోలిస్తే అసలు తేడా ఇదే!

ఈ రోజుల్లో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో మనం తినే ప్రతి పదార్థాన్ని జాగ్రత్తగా పరిశీలించే అలవాటు పెరిగింది. ముఖ్యంగా చక్కెర…

5 minutes ago

రుచికోసం రిస్క్ తీసుకుంటున్నారా? చికెన్‌లో తప్పక దూరంగా ఉండాల్సిన భాగాలు!

చికెన్ అనేది భారతీయుల ఆహారంలో ముఖ్యమైన భాగంగా మారింది. తక్కువ ఖర్చుతో మంచి ప్రోటీన్ లభించడంతో చాలామంది వారానికి పలుమార్లు…

9 minutes ago

గోరువెచ్చని నీరు ఆరోగ్యానికి మంచిదే… కానీ ఎంత వరకు? తెలుసుకోవాల్సిన ముఖ్య సూచనలు

ప్రస్తుత కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది రోజూ వేడి నీళ్లు తాగే అలవాటు చేసుకుంటున్నారు. ఉదయం…

3 hours ago

రోజూ గుడ్డు తింటే పిల్లలకు ఏమవుతుంది? తల్లిదండ్రులకు కీలక సూచనలు!

పిల్లల పెరుగుదల విషయంలో తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. రోజువారీ ఆహారంలో ఏం ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు అనే సందేహాలు…

3 hours ago

మందులు అవసరం లేదు! రోజుకు ఒక చెంచా ఈ గింజలు చాలు – శరీరానికి ఫుల్ పవర్!

ప్రస్తుతం ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. దీర్ఘకాలిక ఆరోగ్యం కోసం చాలా మంది ఖరీదైన సప్లిమెంట్లు, ప్రోటీన్ పౌడర్లు వంటివి…

3 hours ago

జేబులో గుట్కా ఉందా? తెలియకుండానే మృత్యువుకు దగ్గరవుతున్నారా!

భారతదేశంలో క్యాన్సర్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పురుషుల్లో నోటి క్యాన్సర్ వేగంగా పెరుగుతోందని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. Indian…

4 hours ago