General News

ముస్లిం పేషేంట్ చెవిలో ఇస్లామిక్ ప్రార్థన.. హిందూ డాక్టర్ కు నెటిజెన్ల ఫిదా?

ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో వ్యాపిస్తున్న కరోనా మహమ్మారి మనుషుల మధ్య బంధాలను విడదీస్తూ బంధం అనే మాటకి అర్థాన్ని మార్చేసింది. అదేవిధంగా మరికొన్నిచోట్ల కొందరిలో దాగి ఉన్న మానవత్వాన్ని పరిమళింప చేస్తోంది. కరోనా కారణం వల్ల ఎంతో మంది పోలీసులు డాక్టర్లు వారిలో ఉన్న సేవా గుణాన్ని మానవత్వాన్ని ఈ క్లిష్ట పరిస్థితులలో చాటుకున్నారు.తాజాగా కేరళకు చెందిన ఓ వైద్యులు కులమతాలకతీతంగా మానవత్వంతో చేసిన ఓ పని పై ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాలలోకి వెళితే…

కేరళకు చెందిన డాక్టర్ రేఖ కృష్ణన్ అనే వైద్యురాలు హిందూ మతానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ కోవిడ్ బారినపడి చివరి నిమిషాలలో కొట్టుమిట్టాడుతున్న ఓ ముస్లిం బాధితురాలికి తన చెవిలో ఇస్లామిక్ ప్రార్థనలు వినిపించిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.పాలక్కాడ్ పట్టాంబిలోని సెవానా హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్​లో మే 17 న చోటుచేసుకున్న ఈ ఘటన చోటు చేసుకుంది.

బీవతు అనే 56 ఏళ్ల ముస్లిం మహిళ కరోనా బారిన పడటంతో ఆమెను చికిత్స నిమిత్తం సెవానా హాస్పిటల్​లో చేర్చారు. అయితే ఆమె పరిస్థితి విషమించడంతో ఆమెను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. కోవిడ్ నిబంధనల ప్రకారం తనని చూడటానికి తన బంధువులకు అనుమతి లేదు. అయితే రోజురోజుకు ఆమె ఆరోగ్య పరిస్థితి దారుణంగా క్షీణించడంతో పాటు అవయవాలు స్పందించడం మానేశాయి.

ఈ క్రమంలోనే సదరు బాధితురాలిని వెంటిలేటర్​పై నుంచి తొలగించాలని నిర్ణయించారు. మరణం అంచులలో కొట్టుమిట్టాడుతున్న ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఆమె పరిస్థితి దారుణంగా ఉన్న క్రమంలో అక్కడ డాక్టర్ రేఖ కృష్ణన్ విధులు నిర్వహిస్తున్నారు. ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉంటూ కొట్టుమిట్టాడుతున్న ఆమెకు చివరి నిమిషాల్లో కాస్త ఓదార్పును ఇవ్వడం కోసం డాక్టర్ రేఖ ఆమె చెవిలో ఇస్లామిక్ ప్రార్థనలను చదివారు.

ముస్లిం సంప్రదాయం ప్రకారం మరణించే వ్యక్తి చెవిదగ్గర
కలీమా ప్రార్థన పఠిస్తే వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని ప్రగాఢ విశ్వాసం. అందువల్ల రేఖ కృష్ణన్ బాధితురాలి చెవిలో కలీమా ప్రార్థన చదవడంతో సదరు మహిళ గట్టిగా శ్వాస తీసుకొని ప్రాణాలు వదిలింది. ఈ విషయంపై డాక్టర్ స్పందిస్తూ రోగి చివరి నిమిషాలలో తన కుటుంబ సభ్యులు ఎవరూ పక్కన లేకపోవడంతో ఆమెకు ఏదైనా సహాయం చేయాలనిపించడంతోనే ఈ విధంగా ప్రార్థన చేసినట్లు తెలిపారు. నేను హిందూ మతానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ యూఏఈలో పెరిగినందున నాకు ముస్లిం ప్రార్థనలు, పద్ధతులు అన్నింటిపై అవగాహన ఉంది. అందుకోసమే ఆమె చివరి ఘడియలలో ఈ విధంగా ప్రార్థనలో చేశానని తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

1 day ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

1 day ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago