Political News

తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. గోదావరి – బనకచర్ల ప్రాజెక్టుపై కీలక చర్చకు రంగం సిద్ధం!

గోదావరి-బనకచర్ల లింక్‌ ప్రాజెక్టు నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి బుధవారం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక సమావేశానికి హాజరుకానున్నారు. ఈ సమావేశం మధ్యాహ్నం 2.30 గంటలకు ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో జరుగనుంది. ఇరు రాష్ట్రాల సీఎంల కార్యాలయాలకు, ప్రధాన కార్యదర్శులకు జలశక్తి శాఖ ఇప్పటికే సమాచారం పంపింది.

Meeting of CMs of Telugu states.. Key discussion on Godavari-Banakacharla project

ఏపీ ప్రభుత్వం ఈ భేటీలో బనకచర్ల ప్రాజెక్టును ప్రధాన అజెండాగా ప్రతిపాదించింది. కాగా, తెలంగాణ మాత్రం దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ప్రాజెక్టును చర్చలో పెట్టకూడదని స్పష్టం చేసింది. పైగా బనకచర్లకు ఎలాంటి చట్టపరమైన అనుమతులు లేవని, ట్రైబ్యునల్ తీర్పులను ఉల్లంఘిస్తూ అభివృద్ధి చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై చర్చ జరగడం అనుచితమని పేర్కొంటూ, ఈ ప్రాజెక్టుపై ఆమోదముద్ర వేయవద్దని కేంద్రాన్ని కోరింది.

తెలంగాణ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న దిండి, పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాలని, ఇచ్చంపల్లి ప్రాజెక్టును కేంద్రం స్వయంగా చేపట్టాలని, తుమ్మడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీలు కేటాయించాలని, 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు తీసుకురావాలని ప్రతిపాదించింది.

రాష్ట్రాల మధ్య జలవివాదాలు, కొత్త ప్రాజెక్టులపై నిర్ణయాలు తీసుకునేందుకు ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం, కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షతన ఏర్పడే ఎపెక్స్ కౌన్సిల్‌నే అసలు వేదికగా పేర్కొంది. గత పదేళ్లలో ఈ కౌన్సిల్ కేవలం రెండు సార్లే సమావేశమైంది. కాగా, తాజా భేటీలో భిన్న అభిప్రాయాల నేపథ్యంలో, కేంద్రం దశలవారీ చర్చలకు మార్గం వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇద్దరు సీఎంల హాజరుతో జరగబోయే ఈ సమావేశం తెలుగు రాష్ట్రాల మధ్య సాగుతున్న జలవివాదానికి ఒక కీలక మలుపు కావొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

telugudesk

Recent Posts

44 డిగ్రీలకు చేరే ఉష్ణోగ్రతలు.. మూడు రోజులు హెచ్చరిక

తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…

52 minutes ago

ప్రభాస్ ‘ఫౌజీ’ ఛాన్స్ వదిలేసిన టాలీవుడ్ హీరో ఎవరు?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…

59 minutes ago

180 బాధితులు.. దేశాన్ని షాక్‌కు గురిచేసిన ఘటన

మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…

1 hour ago

వరుణ్ తేజ్ గాయం.. నిహారిక ఎమోషనల్ ప్రెస్ నోట్

టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…

2 hours ago

అటెండర్ మాస్టర్ ప్లాన్.. SBIకి రూ.2.65 కోట్ల షాక్!

తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…

4 hours ago

ఎన్నికల వేళ ఆస్తుల వివాదం.. ఉదయనిధిపై విచారణ

తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…

5 hours ago