గత వారం రోజుల నుంచి తీవ్ర వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా తీవ్రమైన వరద నీటిలో మునిగిపోయింది. ఈ క్రమంలోనే గతంలో ఎప్పుడు చూడని విధంగా తిరుమల తిరుపతిలో భారీ వర్షాల కారణంగా తిరుపతి మొత్తం జల సందిగ్దంలో ఉండిపోయింది. ఈ క్రమంలోనే తిరుపతి ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు.
ఈ వరద నీటిలో భాగంగా ఎన్నో వాహనాలు పశువులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. తిరుమల గిరుల నుంచి వర్షపు నీరు జలపాతంగా ప్రవహించడంతో తిరుపతి వీధులన్నీ వరద నీటిలో చిక్కుకున్నాయి. ఈ క్రమంలోనే జనజీవనం స్తంభించిపోయి ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు . ఇదిలా ఉండగా తాజాగా తిరుపతి వరదలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.
ఈ సందర్భంగా చిరంజీవి ద్వారా స్పందిస్తూ గతంలో ఎప్పుడూ లేనంతగా కురుస్తున్న వర్షాలకు తిరుపతి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూస్తుంటే మనసు కలిచివేస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం టిటిడి కలిసికట్టుగా కృషి చేసి వీలైనంతవరకు పరిస్థితులను సాధారణ స్థితికి రావాలని ఏపీ ప్రభుత్వానికి టిటిడికి చిరు విజ్ఞప్తి చేశారు. అదే విధంగా అన్ని రాజకీయ పక్షాలు, అభిమాన సంఘాలు సైతం చేయూతనివ్వాలని ఈ సందర్భంగా చిరు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
గత వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చిత్తూరు జిల్లాలో వరద ముంచెత్తుతోంది. ఈ క్రమంలోనే పలు వాగులు వంకలు పొంగి పొర్లి జనజీవనం స్తంభించిపోయింది. ఇక చెట్లు కూలిపోవడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడి ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 23న జరిగే పుష్పయాగ మహోత్సవానికి ఆలయ…
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…