గత వారం రోజుల నుంచి తీవ్ర వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా తీవ్రమైన వరద నీటిలో మునిగిపోయింది. ఈ క్రమంలోనే గతంలో ఎప్పుడు చూడని విధంగా తిరుమల తిరుపతిలో భారీ వర్షాల కారణంగా తిరుపతి మొత్తం జల సందిగ్దంలో ఉండిపోయింది. ఈ క్రమంలోనే తిరుపతి ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు.
ఈ వరద నీటిలో భాగంగా ఎన్నో వాహనాలు పశువులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. తిరుమల గిరుల నుంచి వర్షపు నీరు జలపాతంగా ప్రవహించడంతో తిరుపతి వీధులన్నీ వరద నీటిలో చిక్కుకున్నాయి. ఈ క్రమంలోనే జనజీవనం స్తంభించిపోయి ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు . ఇదిలా ఉండగా తాజాగా తిరుపతి వరదలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.
ఈ సందర్భంగా చిరంజీవి ద్వారా స్పందిస్తూ గతంలో ఎప్పుడూ లేనంతగా కురుస్తున్న వర్షాలకు తిరుపతి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను చూస్తుంటే మనసు కలిచివేస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం టిటిడి కలిసికట్టుగా కృషి చేసి వీలైనంతవరకు పరిస్థితులను సాధారణ స్థితికి రావాలని ఏపీ ప్రభుత్వానికి టిటిడికి చిరు విజ్ఞప్తి చేశారు. అదే విధంగా అన్ని రాజకీయ పక్షాలు, అభిమాన సంఘాలు సైతం చేయూతనివ్వాలని ఈ సందర్భంగా చిరు ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
గత వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా చిత్తూరు జిల్లాలో వరద ముంచెత్తుతోంది. ఈ క్రమంలోనే పలు వాగులు వంకలు పొంగి పొర్లి జనజీవనం స్తంభించిపోయింది. ఇక చెట్లు కూలిపోవడంతో విద్యుత్ అంతరాయం ఏర్పడి ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…