నందమూరి నటసింహం బాలకృష్ణ తన 107 వ చిత్రంగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్నట్లు మనకు తెలిసిందే. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను ప్రారంభించి సినిమా షూటింగ్ ను మొదలు పెట్టింది.ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించడానికి ముందుగా దర్శకుడు శృతిహాసన్ ను సంప్రదిస్తే ఆమె నో చెప్పినట్లు సమాచారం. అయితే గోపీచంద్ తనను కన్విన్స్ చేయడం వల్ల గోపీచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్, బలుపు వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శృతి హాసన్ దర్శకుడు అడగడంతో కాదనలేకపోయింది.
ఈ సినిమా కోసం శృతి హాసన్ ఒప్పుకోవడమే కాకుండా ఎన్నో కండిషన్ లు పెట్టింది. అదేవిధంగా ఏకంగా తను రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో నిర్మాతలు వెంటనే ఆమె అడిగిన రెమ్యునరేషన్ చెల్లించడమే కాకుండా ఆమె పెట్టిన కండిషన్లకు దర్శకుడు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
ఇందులో గ్లామరస్ పాత్రలో డాన్స్ చేయడానికి, నటించడానికి తనకు అభ్యంతరం లేకపోయినా ఎక్కువగా టచింగ్, హగ్గులు వంటివి ఉండకూడదని, రొమాంటిక్ సన్నివేశాల్లో నటించనని ఈమె కండిషన్ పెట్టిందట. అదేవిధంగా ఈ సినిమాలో తన పాత్ర ఎంతో హుందాగా ఉండాలని ఈమె దర్శకుడికి చెప్పినట్లు సమాచారం.ఈమె పెట్టిన షరతులు అన్నింటికీ ఒప్పుకున్న దర్శకుడు ఎలాంటి సమస్య ఉండదని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇకపోతే బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన అఖండ సినిమా డిసెంబర్ 2వ తేదీ విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేయనున్నారు.
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…
పార్లమెంట్లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…