చిరంజీవి మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో నటనలో శిక్షణ పూర్తి కాకముందే ఆయనకు పునాదిరాళ్లు చిత్రంలో అవకాశం వచ్చింది. ఈ చిత్రానికి హైదరాబాద్ కు చెందిన గూడపాటి రాజ్ కుమార్ దర్శకుడిగా వ్యవహరించారు. ఈ సినిమా తొలిషాట్ లో పొలంలో తన నలుగురు స్నేహితులతో చిరంజీవి పని చేస్తూ ఉంటాడు. రియలిస్టిక్ గా ఉండడానికి చిరంజీవి మిగతా వారిలా కాకుండా తన తలపై గడ్డిపోచలు వేసుకొని కనిపించడం చూసిన కెమెరామెన్, చిరంజీవిని దగ్గరకు పిలిచి భవిష్యత్ లో పెద్ద హీరో అవుతావని చెప్పాడు. ఒకరోజు ఈ సినిమా షూటింగ్ వర్షం కారణంగా ఆగిపోయింది.
దర్శకుడు రాజ్ కుమార్ ప్యాకప్ చెప్పి అక్కడే పల్లెటూరిలోని ఒక ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా.. పక్కగదిలో చిరంజీవి టేప్ రికార్డర్ పెట్టుకొని ఓ పాటకు డాన్స్ చేయడం చూసిన దర్శకుడు రాజ్ కుమార్ పునాదిరాళ్లు చిత్రంలో చిరంజీవికి ఒక పాటను కేటాయించారు. ఆ తర్వాత దర్శకుడు బాపు చిరంజీవి ఎర్రనికళ్ళను చూసి తను తీయబోయే మన ఊరి పాండవులు చిత్రంలో ఐదుగురు హీరోలలో ఒకరిగా చిరంజీవిని తీసుకున్నారు. ఆ రోజుల్లో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో చిరంజీవి నటన చూసి ఆయనతో మళ్లీ ఒక సినిమా తీయాలని బాపుగారు అనుకున్నారు. అలా జయకృష్ణ నిర్మాతగా బాపు దర్శకత్వంలో మంత్రిగారి వియ్యంకుడు అనే చిత్రంలో చిరంజీవి, పూర్ణిమజయరాం హీరో హీరోయిన్లుగా నటించారు.
అయితే ఈ చిత్రంలో మంత్రి గా నటించడానికి ఎవరైతే బాగుంటుందని దర్శకుడు బాపు ఆలోచిస్తున్న తరుణంలో.. అదే చిత్రంలో లీడ్ రోల్ పోషిస్తున్న అల్లు రామలింగయ్య ఎవరో ఎందుకు మా బావగారు ఆ పాత్రను పోషిస్తారని చిరంజీవి తండ్రి కె.వెంకటరావును చూపించడం జరిగింది. అలా ఆ చిత్రంలో కె.వెంకట్ రావు ఒక సన్నివేశంలో నటించాల్సి వచ్చింది. అయితే చిరంజీవి నాన్నగారైన వెంకటరావు కి ఇదే తొలి చిత్రం అని చెప్పలేము. 1969లో జగత్ జెట్టీలు అనే చిత్రంలో ఆయన మొదటగా నటించారు. ఆ తర్వాత ఒకటి, రెండు చిత్రాల్లో నటించినప్పటికీ కుటుంబ బాధ్యతల వల్ల ఆయన సినిమాల్లో తిరిగి నటించాలని అనుకోలేదు. పైగా ఎక్సైజ్ డిపార్ట్మెంటులో ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహించడం వలన సినిమాల్లో నటించే సమయం లేకుండా పోయింది.
కానీ సినిమా రంగంలో తన కొడుకులు అభివృద్ధి చెందాలని ఎప్పుడు కోరుకునేవారు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత 1983 లో అల్లు రామలింగయ్య కోరిక మేరకు చిరంజీవి సినిమా అయినా మంత్రిగారి వియ్యంకుడులో ఒక సన్నివేశంలో నటించాల్సి వచ్చింది. తర్వాత ఆయన తిరిగి ఏ చిత్రంలో నటించలేదు. ఆయన కోరుకున్నట్టుగానే పెద్దకొడుకైన చిరంజీవి సుప్రీం,మెగాస్టార్ గా చిత్ర సీమలో నెంబర్ వన్ హీరోగా ఉన్నారు.
ఇంట్లోనే తక్కువ పదార్థాలతో, ఆరోగ్యానికి మేలు చేసే స్వీట్లు తయారు చేయడం ఇటీవలి కాలంలో మళ్లీ ట్రెండ్గా మారుతోంది. ముఖ్యంగా…
అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా ఆకలి వేయడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ అనుభవం. రోజంతా సరైన సమయానికి భోజనం చేసినప్పటికీ…
వేసవి మొదలైనప్పుడే శరీరం చల్లదనం కోసం తపిస్తుంది. ఈ కాలంలో మార్కెట్లో లభించే పండ్లలో మామిడి, పుచ్చకాయ ప్రత్యేక స్థానం…
దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత కనిపిస్తున్న నేపథ్యంలో చాలా మంది తమ…
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…