దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో రోజురోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండడంతో తీవ్రమైన అంబులెన్స్ కొరత ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించడం కోసం మహారాష్ట్రలోని నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక చర్యలు చేపట్టాయి.
ఈ క్రమంలోనే నగరంలో ఏర్పడిన ఆంబులెన్స్ కొరతను తీర్చేందుకు మినీ బస్సులను అంబులెన్సులుగా మార్చింది. మొత్తం 25 మినీ బస్సులను అంబులెన్సులు గా మార్చి కోవిడ్ బాధితులకు అందుబాటులోకి తీసుకువచ్చింది.మహారాష్ట్రలో అంబులెన్స్ కొరత ఉండటం వల్ల ఇప్పటి వరకు కరోనా బాధితులు ప్రైవేట్ అంబులెన్స్ లో ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే ప్రైవేట్ అంబులెన్సులు వేలకు వేలు డబ్బులు తీసుకోవడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు.
కేవలం పది రోజుల వ్యవధిలోనే 25 మినీ బస్సులలో ఉన్న సీట్లను తొలగించి కరోనా బాధితుల కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. బెడ్, ఆక్సిజన్ సిలిండర్ వంటి సదుపాయాలను అంబులెన్స్ లో అమర్చి కరోనా బాధితులకు అందుబాటులోకి తేనున్నారు. ఈ అంబులెన్స్ సేవలను అందుకోవడం కోసం ప్రత్యేకమైన 0712 2551417 హెల్ప్ లైన్ నెంబర్ ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.
కరోనాతో బాధపడేవారు అంబులెన్స్ ల కోసం ఈ హెల్ప్ లైన్ నెంబర్ కి ఫోన్ చేస్తే చాలు అంబులెన్స్ స్వయంగా బాధితుల ఇంటి దగ్గరకు చేరుకుని వారిని ఆస్పత్రిలో చేరుస్తారని మహారాష్ట్ర అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…