General News

మినీ బస్సులను అంబులెన్సులుగా మార్చి.. కోవిడ్ బాధితులకు అలా సేవలు?

దేశవ్యాప్తంగా రోజురోజుకు కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో రోజురోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండడంతో తీవ్రమైన అంబులెన్స్ కొరత ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించడం కోసం మహారాష్ట్రలోని నాగపూర్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక చర్యలు చేపట్టాయి.

ఈ క్రమంలోనే నగరంలో ఏర్పడిన ఆంబులెన్స్ కొరతను తీర్చేందుకు మినీ బస్సులను అంబులెన్సులుగా మార్చింది. మొత్తం 25 మినీ బస్సులను అంబులెన్సులు గా మార్చి కోవిడ్ బాధితులకు అందుబాటులోకి తీసుకువచ్చింది.మహారాష్ట్రలో అంబులెన్స్ కొరత ఉండటం వల్ల ఇప్పటి వరకు కరోనా బాధితులు ప్రైవేట్ అంబులెన్స్ లో ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే ప్రైవేట్ అంబులెన్సులు వేలకు వేలు డబ్బులు తీసుకోవడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు.

కేవలం పది రోజుల వ్యవధిలోనే 25 మినీ బస్సులలో ఉన్న సీట్లను తొలగించి కరోనా బాధితుల కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. బెడ్, ఆక్సిజన్ సిలిండర్ వంటి సదుపాయాలను అంబులెన్స్ లో అమర్చి కరోనా బాధితులకు అందుబాటులోకి తేనున్నారు. ఈ అంబులెన్స్ సేవలను అందుకోవడం కోసం ప్రత్యేకమైన 0712 2551417 హెల్ప్ లైన్ నెంబర్ ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు.

కరోనాతో బాధపడేవారు అంబులెన్స్ ల కోసం ఈ హెల్ప్ లైన్ నెంబర్ కి ఫోన్ చేస్తే చాలు అంబులెన్స్ స్వయంగా బాధితుల ఇంటి దగ్గరకు చేరుకుని వారిని ఆస్పత్రిలో చేరుస్తారని మహారాష్ట్ర అధికారులు ఈ సందర్భంగా వెల్లడించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago