Political News

ఏపీలో ఆ కులం వాళ్లకు శుభవార్త.. ఖాతాల్లో రూ.15 వేలు జమ..!

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. కరోనా, లాక్ డౌన్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పథకాల అమలు విషయంలో మాత్రం జగన్ ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒకటీఅరా మినహా మిగిలిన అన్ని హామీలను జగన్ ఇప్పటికే నెరవేర్చారు. జగన్ సర్కార్ అర్హత ఉండి పథకాలలో పేరు రాకపోతే వాళ్లకు మళ్లీ దరఖాస్తు చేసే అవకాశం కల్పిస్తూ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరేలా చేస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వల్ల గత ప్రభుత్వాలకు భిన్నంగా సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయని రాష్ట్ర ప్రజానీకం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా జగన్ సర్కార్ వైఎస్సార్ కాపు నేస్తం రెండో విడత అమలుకు సిద్ధమవుతోంది. కొందరు వైఎస్సార్ కాపునేస్తం స్కీమ్ కు అర్హులైనా వివిధ కారణాల వల్ల ఈ పథకానికి అర్హత పొందలేదు. దీంతో ప్రభుత్వం కొత్తగా కాపు నేస్తంలో చేరిన లబ్ధిదారులకు ఖాతాలలో 15 వేల రూపాయల చొప్పున నగదు జమ చేసింది. కాపు కులంలో వెనుకబడిన వారిని ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా ఆదుకోనుంది.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు అనుగుణంగా జగన్ సర్కార్ కాపుల కోసం ప్రతి సంవత్సరం 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. 45 నుంచి 60 సంవత్సరాల మద్య వయస్సు ఉన్న కాపు, బలిజ, ఒంటరి, తెలగ వర్గాల మహిళలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 hour ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

2 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

2 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

19 hours ago

పేద దేశాల నుంచి వలసలకు బ్రేక్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా భవిష్యత్తుపై ఆందోళన

అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…

20 hours ago

మన బట్టలపై కనిపించే S, M, L సైజ్ ట్యాగ్ వెనుక భారీ చరిత్ర..

ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…

21 hours ago