Minister RK Roja : సినిమాల్లో హీరోయిన్ గా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అగ్ర హీరోయిన్ గా ఎన్నో సినిమాలలో కొన్నేళ్లు టాప్ లో ఉన్న రోజా అన్ని భాషల్లోనూ హీరోయిన్ గా నటించింది. ఇక పెళ్లి చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ లో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన రోజా అటు బుల్లితెర మీదా అదరగొట్టింది. మోడరన్ మహలక్ష్మి తో మొదలు పెట్టి జబర్దస్త్ తో మరోసారి మంచి ఫామ్ లోకి వచ్చింది. అటు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే ఇటు జబర్దస్త్ షో చేస్తూ ఉండే రోజా పాలిటిక్స్ లో మొదట టీడీపీ తో మొదలు పెట్టి ఆ తరువాత వైసీపీ లోకి వెళ్లి ప్రస్తుతం నగరి ఎమ్మెల్యే గా ఉంటూ అలానే మంత్రిగా జగన్ కేబినెట్ లో కొనసాగుతున్నారు. రాజకీయాల్లో వచ్చి ప్రజాసేవ చేస్తున్నారు రోజా.
అలాంటి ప్రశ్నలు అడగొద్ధు… వాళ్ళు పాలిటిక్స్ కి పనికిరారు…
ఏపీ సీఎం జగన్ పుట్టినరోజునాడు 2020 లో పుష్ప అనే ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆ అమ్మాయి చదువు బాధ్యత నాదే అంటూ హామీ ఇచ్చారు. ఆ అమ్మాయి నేడు డాక్టర్ విద్య అభ్యసిస్తోంది. ఇక రోజా గారు 2021 లో నగరి నియోజకవర్గంలోని మీరా సాహెబ్ పాలెం అనే ఊరిని దత్తత తీసుకొని మోడల్ గ్రామంగా మార్చడానికి కృషి చేస్తున్నారు. ఇక ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడిన రోజా సినిమా ఇండస్ట్రీలోని వాళ్ళు రాజకీయాల్లోకి పనికిరారు అంటూ హాట్ కామెంట్స్ చేసారు. సినిమా వాళ్ళు ఒక పంజరంలో బ్రతుకుతుంటారని, వాళ్ళ చుట్టూ ఉన్నవాళ్లు నువ్వు తోపు అంటూ ఒక ఇమేజ్ లో పెట్టేస్తారు, అందులోనూ సినిమా వాళ్ళు సెన్సిటివ్ గా ఉంటారు, వాళ్ళు పాలిటిక్స్ లో ఓటమి వస్తే తట్టుకోలేరు అందుకే చిరంజీవి లాంటి వాళ్ళు పాలిటిక్స్ కి పనికిరారు అంటూ కామెంట్స్ చేసారు.
ఇక తాను ఇండస్ట్రీ నుండి వచ్చినా నా అన్నలు నన్ను ఆ ఇమేజ్ చట్రం నుండి బయటకు తెచ్చారు. నా సినిమాలను పొగిడేవాళ్ళు ఎంతమంది ఉన్నా మా ఒక అన్న నన్ను విమర్శిస్తూనే ఉంటాడు. అందుకే నాకు ఫ్లాప్స్ అయినా హిట్స్ అయినా ఒకేలా ఉన్నాను అదే రాజకీయాల్లో ఉపయోగపడింది అంటూ చెప్పారు. ఇక వ్యక్తిగత ప్రశ్నలు అడిగినా పర్వాలేదు కానీ వ్యక్తిత్వాన్ని కించపరిచే ప్రశ్నలు అడగవద్దు అంటూ ఇంటర్వ్యూలో సీరియస్ అయ్యారు మంత్రి రోజా. కాంగ్రెస్ నుండి టీడీపీ అక్కడి నుండి వైసీపీ లో ఉన్న రోజా నెక్స్ట్ పార్టీ మారితే ఏ పార్టీ వెళ్తారు అనే ప్రశ్నకు వైసీపీ నుండి ఏ పార్టీ కి వెళ్ళను, ఒకవేళ అధినేత పార్టీ నుండి వెళ్ళమంటే వేరే పార్టీలోకి చేరను. రాజకీయాలకు దూరంగా ఉంటాను అంటూ కుండ బద్ధలు కొట్టారు రోజా.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…