Featured

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ తీపికబురు..!!

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. కరోనా కష్ట కాలంలో ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్, లడఖ్, అండమాన్ నికోబార్ దీవులు, ఈశాన్య రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాబోయే రెండేళ్లలో పర్యటించడం కోసం సెలవు ప్రయాణ భత్యం(ఎల్టీఎ) ఇవ్వడానికి సిద్ధమైంది. మరికొన్ని రోజుల్లో దసరా, దీపావళి పండుగలు ఉన్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. కేంద్రం నుంచి త్వరలో అధికారికంగా ఈ మేరకు ప్రకటన వెలువడనుంది. కేంద్రం తీసుకున్నఈ నిర్ణయం గురించి ఉద్యోగుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. జితేంద్ర సింగ్ ఉద్యోగులకు పెయిడ్ లీవ్ తో పాటు లీవ్ ట్రావెల్ కన్షెషన్ కూడా ఇవ్వబోతున్నట్టు వెల్లడించారు. ఎకానమీ క్లాస్ టికెట్లను బుక్ చేసుకొని ప్రైవేట్ విమానాల్లో కూడా ఉద్యోగులు ప్రయాణం చేయవచ్చని తెలిపారు.

2022 సంవత్సరం సెప్టెంబర్ 25 వరకు ఈ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. సాధారణంగా కేంద్ర ఉద్యోగులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఎల్టీఏను అందిస్తోంది. ఉద్యోగులు ఒంటరిగా లేదా కుటుంబ సభ్యులతో వెళ్లి ఖర్చులను ఎల్టీఎ కింద పొందవచ్చు. మరోవైపు కేంద్రం ఈ సంవత్సరానికి మాత్రం ఉద్యోగుల భత్యాన్ని పెంచలేదు. రోజురోజుకు ఆర్థిక పరిస్థితి దిగజారుగుతున్న నేపథ్యంలో భత్యం పెంచే దిశగా కేంద్రం అడుగులు వేయలేదు.

కరోనా సంక్షోభం ప్రభావం దేశ ఆర్థిక స్థితిపై భారీగా పడింది. కేంద్రం అన్ లాక్ అన్ లాక్ కు నిబంధనలను భారీగా సడలిస్తున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది. దేశంలోని పలు కీలక రంగాలపై నేటికీ ఆంక్షలు అమలవుతున్నాయి. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చి పరిస్థితుల్లో మార్పులు వస్తే మాత్రమే భారత్ ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మ్యాచ్‌కు ముందు కార్టూన్లు.. మైదానంలో రికార్డులు! సూర్యవంశీ స్టైల్

ఐపీఎల్ 2026 సీజన్‌లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…

1 hour ago

స్విమ్ సూట్ ఫోటోలు పంపినా ఛాన్స్ మిస్.. నటి షాకింగ్ రివీల్

సినిమా రంగంలో అవకాశాలు పొందడం మాత్రమే కాదు, వాటిని నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టమైన విషయం. ఈ ప్రయాణంలో ఎదురయ్యే…

1 hour ago

ఓటు వేయడానికి వచ్చిన విజయ్.. పోలింగ్ కేంద్రంలో గందరగోళం

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతున్న వేళ, ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ అధినేత విజయ్ ఓటు హక్కు…

1 hour ago

కావాలనే ఇరికించారు.. మంగ్లీ సంచలన వ్యాఖ్యలు

మైక్రో ఫైనాన్స్ పేరిట వెలుగులోకి వచ్చిన ఆర్థిక మోసం కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో పలువురిపై…

2 hours ago

చిరంజీవి నో చెప్పిన సినిమా.. నాగార్జునకు బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చింది

తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని సినిమాల విజయాల వెనుక ఆసక్తికర కథలు దాగి ఉంటాయి. అలాంటి సంఘటనల్లో ఒకటి హలో…

2 hours ago

“నోరు తెరిస్తే కాపురాలు కూలిపోతాయి”.. గీతా మాధురి షాకింగ్ కామెంట్స్..!

తెలుగు గాన రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న గీతా మాధురి తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా…

2 hours ago