Featured

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ తీపికబురు..!!

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. కరోనా కష్ట కాలంలో ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్, లడఖ్, అండమాన్ నికోబార్ దీవులు, ఈశాన్య రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు రాబోయే రెండేళ్లలో పర్యటించడం కోసం సెలవు ప్రయాణ భత్యం(ఎల్టీఎ) ఇవ్వడానికి సిద్ధమైంది. మరికొన్ని రోజుల్లో దసరా, దీపావళి పండుగలు ఉన్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. కేంద్రం నుంచి త్వరలో అధికారికంగా ఈ మేరకు ప్రకటన వెలువడనుంది. కేంద్రం తీసుకున్నఈ నిర్ణయం గురించి ఉద్యోగుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. జితేంద్ర సింగ్ ఉద్యోగులకు పెయిడ్ లీవ్ తో పాటు లీవ్ ట్రావెల్ కన్షెషన్ కూడా ఇవ్వబోతున్నట్టు వెల్లడించారు. ఎకానమీ క్లాస్ టికెట్లను బుక్ చేసుకొని ప్రైవేట్ విమానాల్లో కూడా ఉద్యోగులు ప్రయాణం చేయవచ్చని తెలిపారు.

2022 సంవత్సరం సెప్టెంబర్ 25 వరకు ఈ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. సాధారణంగా కేంద్ర ఉద్యోగులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఎల్టీఏను అందిస్తోంది. ఉద్యోగులు ఒంటరిగా లేదా కుటుంబ సభ్యులతో వెళ్లి ఖర్చులను ఎల్టీఎ కింద పొందవచ్చు. మరోవైపు కేంద్రం ఈ సంవత్సరానికి మాత్రం ఉద్యోగుల భత్యాన్ని పెంచలేదు. రోజురోజుకు ఆర్థిక పరిస్థితి దిగజారుగుతున్న నేపథ్యంలో భత్యం పెంచే దిశగా కేంద్రం అడుగులు వేయలేదు.

కరోనా సంక్షోభం ప్రభావం దేశ ఆర్థిక స్థితిపై భారీగా పడింది. కేంద్రం అన్ లాక్ అన్ లాక్ కు నిబంధనలను భారీగా సడలిస్తున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది. దేశంలోని పలు కీలక రంగాలపై నేటికీ ఆంక్షలు అమలవుతున్నాయి. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చి పరిస్థితుల్లో మార్పులు వస్తే మాత్రమే భారత్ ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

2 days ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

2 days ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

2 days ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

2 days ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

2 days ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

2 days ago