ఈ ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్ క్రీడలలో భారత క్రీడాకారులు వివిధ క్రీడలలో ఏడు పథకాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బ్యాడ్మింటన్ లో కాంస్య పతకాన్ని సంపాదించుకున్న పివి సింధు ఒలంపిక్ క్రీడలలో రెండు పథకాలను సాధించిన క్రీడాకారిణిగా రికార్డును సొంతం చేసుకుంది.తాజాగా జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకాన్ని సంపాదించుకున్న పీవీ సింధుపై ప్రశంసలు వెల్లువెత్తాయి.
తాజాగా భారతదేశానికి ఒలంపిక్ క్రీడలలో పథకాలు తీసుకువచ్చిన క్రీడాకారులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గౌరవ సత్కారాలను చేశారు. ఈ క్రమంలోనే ఆటగాళ్లు అందరికీ అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ బ్యాడ్మింటన్ ప్లేయర్ సింధు తో ప్రత్యేకంగా ముచ్చటించారు.
ఈ క్రమంలోనే పీవీ సింధుతో మాట్లాడుతూ తనకు ముందుగా ఒక ఐస్ క్రీమ్ ఆర్డర్ చేయబోతున్నట్లు తెలిపారు.ఒలంపిక్ క్రీడలలో భాగంగా గత కొంత కాలం నుంచి పీవీ సింధు ఐస్ క్రీమ్ తినకుండా ఉండటం వల్ల కాంస్య పతకాన్ని గెలిచిందని ఈ క్రమంలోనే తనకు ఒక ఐస్ క్రీమ్ ఆఫర్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ విషయాన్ని పీవీ సింధు ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీ దగ్గ రనుంచి అరుదైన గౌరవ సత్కారం లభించిందని తెలియజేశారు.
అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పీవీ సింధు చిన్న బహుమతిని అందజేసినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తన బ్యాడ్మింటన్ రాకెట్ ఇచ్చినట్లు పీవీ సింధు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం పీవీ సింధు ఒలంపిక్స్ లో ఆడినటువంటి బ్యాడ్మింటన్ బ్యాట్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.
తమిళ సినీ పరిశ్రమలో అగ్ర హీరోగా గుర్తింపు పొందిన విజయ్ వ్యక్తిగత జీవితం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆయన భార్య…
వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే సహజ పానీయాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సంప్రదాయంగా ఉపయోగించే “బాదం…
సౌత్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ శృతి హాసన్ మరోసారి వ్యక్తిగత జీవితంతో వార్తల్లో నిలిచింది.…
ప్రసిద్ధ సినీ నటి తమన్నాభాటియా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి భక్తిశ్రద్ధలు చాటుకున్నారు. తిరుమల దేవాలయంలోఉదయం వేళలోనే ఆమె స్వామివారిని…
టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ అనన్య నాగళ్ల ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఆమె…
తెలంగాణకు చెందిన ఓ భక్తుడు తన భక్తిశ్రద్ధలను ప్రత్యేకంగా చాటుకున్నారు. హైదరాబాద్కు చెందిన ఈ భక్తుడు, ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం…