ఈ ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్ క్రీడలలో భారత క్రీడాకారులు వివిధ క్రీడలలో ఏడు పథకాలను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బ్యాడ్మింటన్ లో కాంస్య పతకాన్ని సంపాదించుకున్న పివి సింధు ఒలంపిక్ క్రీడలలో రెండు పథకాలను సాధించిన క్రీడాకారిణిగా రికార్డును సొంతం చేసుకుంది.తాజాగా జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో కాంస్య పతకాన్ని సంపాదించుకున్న పీవీ సింధుపై ప్రశంసలు వెల్లువెత్తాయి.
తాజాగా భారతదేశానికి ఒలంపిక్ క్రీడలలో పథకాలు తీసుకువచ్చిన క్రీడాకారులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గౌరవ సత్కారాలను చేశారు. ఈ క్రమంలోనే ఆటగాళ్లు అందరికీ అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ బ్యాడ్మింటన్ ప్లేయర్ సింధు తో ప్రత్యేకంగా ముచ్చటించారు.
ఈ క్రమంలోనే పీవీ సింధుతో మాట్లాడుతూ తనకు ముందుగా ఒక ఐస్ క్రీమ్ ఆర్డర్ చేయబోతున్నట్లు తెలిపారు.ఒలంపిక్ క్రీడలలో భాగంగా గత కొంత కాలం నుంచి పీవీ సింధు ఐస్ క్రీమ్ తినకుండా ఉండటం వల్ల కాంస్య పతకాన్ని గెలిచిందని ఈ క్రమంలోనే తనకు ఒక ఐస్ క్రీమ్ ఆఫర్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ విషయాన్ని పీవీ సింధు ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీ దగ్గ రనుంచి అరుదైన గౌరవ సత్కారం లభించిందని తెలియజేశారు.
అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పీవీ సింధు చిన్న బహుమతిని అందజేసినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తన బ్యాడ్మింటన్ రాకెట్ ఇచ్చినట్లు పీవీ సింధు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం పీవీ సింధు ఒలంపిక్స్ లో ఆడినటువంటి బ్యాడ్మింటన్ బ్యాట్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…