ఇటలీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, అక్కడి ప్రధాని జార్జియా మెలోనితో కలసి చేసిన ఒక సరదా క్షణం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అధికారిక సమావేశాలకు ముందు మోదీ, మెలోనికి ప్రముఖ ‘మెలోడీ’ చాక్లెట్ల ప్యాక్ను అందజేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. నెటిజన్లు చాలాకాలంగా వీరిద్దరినీ “#Melodi” అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తుండగా, అదే పేరును గుర్తు చేసేలా మోదీ ఈ గిఫ్ట్ ఇవ్వడం ఆసక్తి రేపింది.
రోమ్లో జరిగిన ఈ భేటీలో ఇద్దరు నాయకులు ఎంతో ఆత్మీయంగా మాట్లాడుకుంటూ కనిపించారు. మోదీ అందించిన చాక్లెట్లను స్వీకరించిన మెలోని చిరునవ్వుతో స్పందించగా, ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయింది. తర్వాత ఆ వీడియోను సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో షేర్ చేసిన మెలోని, బహుమతికి కృతజ్ఞతలు తెలుపుతూ పోస్ట్ పెట్టారు. దీంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్తో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.
ఇటలీ పర్యటనలో భాగంగా మోదీ, మెలోని కలిసి రోమ్లోని చారిత్రాత్మక కొలోసియంను సందర్శించారు. అనంతరం వాణిజ్యం, రక్షణ, కనెక్టివిటీ, టెక్నాలజీ వంటి కీలక రంగాల్లో భారత్-ఇటలీ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు. అధికారిక చర్చలకంటే ముందు చోటుచేసుకున్న ఈ చిన్న సంఘటన ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలను మరోసారి హైలైట్ చేసింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…