Mohan Babu Letter: సినిమా ఇండస్ట్రీకి దాసరి గారి మరణం తర్వాత పెద్దదిక్కు లేదనీ ఇండస్ట్రీకి మీరు పెద్ద దిక్కుగా ఉండాలని చిరంజీవి సినీ కార్మికులు అడగగా అందుకు చిరంజీవి నాకు అలాంటి బాధ్యత వద్దని, అలాంటి పదవికి అర్హుడు కాదని పేర్కొన్నారు.అయితే ఏ ఒక్క కార్మికుడికి ఆపద వచ్చినా ఆదుకోవడానికి తాను ఎప్పుడూ ముందు ఉంటానని చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఈ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యల అనంతరం నటుడు మోహన్ బాబు బహిరంగంగా లేఖ రాశారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా మోహన్ బాబు తెలియజేస్తూ…
మనకెందుకులే.. మనకెందుకులే అని మౌనంగా ఉండటం చేతకాని తనం కాదు. కొంతమంది శ్రేయోభిలాషులు మనకెందుకులే నీ మాటలు ఎంతో నిక్కచ్చిగా, ఇబ్బందికరంగా ఉంటాయి అన్నారు. ఇబ్బందికరంగా ఉన్న నిజాలే ఉంటాయి. ఇతరులను ఇబ్బంది పెట్టడం దేనికి? ఇదంతా నీకు అవసరమా? అని ఎంతో మంది అన్నారు. అంటే వాళ్ళు చెప్పినట్లు నేను బ్రతకాలా? సినిమా ఇండస్ట్రీ అంటే ఈ నలుగురు హీరోలు నలుగురు నిర్మాతలు కాదు సినిమా ఇండస్ట్రీ అంటే కొన్ని వేల కుటుంబాల కల..కొన్ని వేల మంది జీవితాలు ఇండస్ట్రీ పై ఆధారపడి ఉన్నాయి ఇది నేను నా నలభై ఏడు సంవత్సరాల అనుభవంతో చెబుతున్న మాట.
ఇండస్ట్రీలో చిన్న పెద్ద అని లేకుండా చిన్న సినిమాలు ఆడాలి పెద్ద సినిమాలు ఆడాలి. సినిమాలు ఆడాలంటే సరైన ధరలు ఉండాలి.ఈ విషయంపై ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎందుకు మౌనంగా ఉంది. అసలు ప్రొడ్యూసర్లు ఎక్కడున్నారు..ఎంతో మంది జీవితాలతో ముడిపడి ఉన్న ఈ సినిమా సమస్యలు పరిష్కారం కావాలంటే అందరం ఒకచోట సమావేశమై ఈ సమస్యకు గురించి సీఎంలకు వివరించాలి. ఈ సమస్యకు పరిష్కారం ఏంటి.. ఏం చేస్తే సినీ పరిశ్రమ మనుగడ బాగుంటుంది అని చర్చించుకోవాలని ఈ సందర్భంగా మోహన్ బాబు లేఖ రాశారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…
భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ పాకిస్తాన్లోని కీలక అణు…
భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…
భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…
టాలీవుడ్లో గత కొంతకాలంగా హాట్ టాపిక్గా మారిన కాంబినేషన్ ఇదే. రెబల్ స్టార్ Prabhas, ‘హనుమాన్’తో సంచలనం సృష్టించిన దర్శకుడు…