Mohan Babu Letter: సినిమా ఇండస్ట్రీకి దాసరి గారి మరణం తర్వాత పెద్దదిక్కు లేదనీ ఇండస్ట్రీకి మీరు పెద్ద దిక్కుగా ఉండాలని చిరంజీవి సినీ కార్మికులు అడగగా అందుకు చిరంజీవి నాకు అలాంటి బాధ్యత వద్దని, అలాంటి పదవికి అర్హుడు కాదని పేర్కొన్నారు.అయితే ఏ ఒక్క కార్మికుడికి ఆపద వచ్చినా ఆదుకోవడానికి తాను ఎప్పుడూ ముందు ఉంటానని చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు ఈ విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు. చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యల అనంతరం నటుడు మోహన్ బాబు బహిరంగంగా లేఖ రాశారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా మోహన్ బాబు తెలియజేస్తూ…
మనకెందుకులే.. మనకెందుకులే అని మౌనంగా ఉండటం చేతకాని తనం కాదు. కొంతమంది శ్రేయోభిలాషులు మనకెందుకులే నీ మాటలు ఎంతో నిక్కచ్చిగా, ఇబ్బందికరంగా ఉంటాయి అన్నారు. ఇబ్బందికరంగా ఉన్న నిజాలే ఉంటాయి. ఇతరులను ఇబ్బంది పెట్టడం దేనికి? ఇదంతా నీకు అవసరమా? అని ఎంతో మంది అన్నారు. అంటే వాళ్ళు చెప్పినట్లు నేను బ్రతకాలా? సినిమా ఇండస్ట్రీ అంటే ఈ నలుగురు హీరోలు నలుగురు నిర్మాతలు కాదు సినిమా ఇండస్ట్రీ అంటే కొన్ని వేల కుటుంబాల కల..కొన్ని వేల మంది జీవితాలు ఇండస్ట్రీ పై ఆధారపడి ఉన్నాయి ఇది నేను నా నలభై ఏడు సంవత్సరాల అనుభవంతో చెబుతున్న మాట.
ఇండస్ట్రీలో చిన్న పెద్ద అని లేకుండా చిన్న సినిమాలు ఆడాలి పెద్ద సినిమాలు ఆడాలి. సినిమాలు ఆడాలంటే సరైన ధరలు ఉండాలి.ఈ విషయంపై ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎందుకు మౌనంగా ఉంది. అసలు ప్రొడ్యూసర్లు ఎక్కడున్నారు..ఎంతో మంది జీవితాలతో ముడిపడి ఉన్న ఈ సినిమా సమస్యలు పరిష్కారం కావాలంటే అందరం ఒకచోట సమావేశమై ఈ సమస్యకు గురించి సీఎంలకు వివరించాలి. ఈ సమస్యకు పరిష్కారం ఏంటి.. ఏం చేస్తే సినీ పరిశ్రమ మనుగడ బాగుంటుంది అని చర్చించుకోవాలని ఈ సందర్భంగా మోహన్ బాబు లేఖ రాశారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…