ప్రస్తుతం అటు మా ఎన్నికల వేడి ఘాటూగా సాగుతోంది. ఒకరిపై ఒకరు బహిరంగంగానే విమర్శలు చేసుకుంటున్నారు. మంచు విష్ణుకు, ప్రకాష్ రాజ్ కు మధ్య పోటీ ఎక్కువగా ఉంటుందనేది తెలుస్తోంది. ఇదిలా ఉండగా మరో పక్క సీనియర్ నటుడు మోహన్ బాబు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాడు. పలు కార్యక్రమాలకు హాజరవుతూ.. ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.
ఇటీవల ఈటీవీలో ప్రసారం అవుతున్నా ‘అలీతో సరదాగా’లో అలీతో ముచ్చటించిన మోహన్ బాబు తాజాగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. దీనికి సంబంధించి ప్రోమోను విడుదల చేశారు. అందులో జీవితం ఎలా ఉందంటూ ఆర్కే ప్రశ్నించగా దానికి మోహన్ బాబు ఇలా చెబుతాడు. ‘నిన్న జరిగింది మరచిపోను.. నేడు జరగాల్సింది వాయిదా వేయను.. రేపటి గురించి ఆలోచించను’ అంటూ డైలాగ్ చెబుతాడు.
ఇది అందరినీ ఆకట్టుకుంది. సీమ టపాకాయ్ లాగా పేలే మోహన్ బాబుకు ఇంత వేదాంతం ఎలా వచ్చింది అనగానే.. నెత్తి పగిలిపోయిందంటూ సమాధానం ఇస్తాడు మోహన్ బాబు. ఇలా ఆర్కే అడిగిన చాలా ప్రశ్నలకు మోహన్ బాబు ఆలోచించి మరీ సమాధానలు చెప్పారు.
ఇలా అడిగిన ప్రశ్నల్లో తమను టీటీడీ చైర్మన్ గా ఎందుకు నియమించలేదు అన్నదానికి ‘నాకు సీఎం జగన్ కు మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారా’ అంటూ సమాధానంగా చెబుతాడు. ఇంకా చిరంజీవి ప్రస్తావన కూడా తీసుకొచ్చిన ఆర్కే ‘పెట్టడండి.. పుల్లలు పెట్టండి’ అంటూ ఆర్కేను చమత్కరిస్తాడు. ఇలా ఎన్నో ప్రశ్నలు సంధించిన ఆర్కే మోహన్ బాబు సమాధానాలు ఎలా చెప్పాడో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…