Latha Mangeshkar: గాన కోకిల లతా మంగేష్కర్ స్వరం నుంచి జాలువారిన..! మోస్ట్ రొమాంటిక్ 10 పాటలు ఇవే.. !
Latha Mangeshkar: ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఈరోజు (ఫిబ్రవరి 6) 92 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఈమె గత నెల 8న కోవిడ్-19 పాజిటివ్ రాగా.. ఆమెను ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం..ముంబాయ్ లోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చేర్చారు.
తర్వాత కొన్నాళ్లకు ఆమె కోవిడ్ నుంచి కోలుకున్నారు. అయినా ఆమెకు నీరసంగా అనిపించడంతో అక్కడే చికిత్స తీసుకున్నారు. తర్వాత వైద్యులు ఆమె ఆరోగ్యం బాగానే ఉందంటూ స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. కొన్నాళ్లకు అస్వస్థకు గురి కాగా వెంటిలెటర్ పై చికిత్స అందిస్తుండగా.. ఆమె ఈ రోజు తుది శ్వాస విడిచారు.
దీంతో ఆమె మరణంపట్ల ప్రతీ ఒక్కరు సంతాపం వ్యక్తం చేశారు. ఇక నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన లతా మంగేష్కర్ 36 కంటే ఎక్కువ భాషల్లో పాటలు పాడారు . అంతే కాదు..25,000 పాటలలకు పైగా పాడి.. ఏ భాషలో కూడా తనకు తిరుగు లేదు అని నిరూపించున్నారు. ఇలా ఆమె గాన కోకిలగా పేరు పొందారు.
ఇక ఆమె జీవితంలో మరపురాని ఎన్నో మెలోడీ పాటలు ఉన్నాయి. అందులో మెలోడీ క్వీన్ని గుర్తు చేసుకుంటూ.. పాత కాలపు వ్యామోహాన్ని గుర్తుచేస్తూ.. ఆ అనుభూతిని కలిగించే 10 ఉత్తమ రొమాంటిక్ పాటల గురించి తెలుసుకుందాం.. అందులో మొదటగా..
లాగ్ జా గలే
1964 చలనచిత్రం వో కౌన్ తీలోని ఈ మధురమైన పాట లతా మంగేష్కర్ పాడిన టైమ్లెస్ రొమాంటిక్ క్లాసిక్లలో ఒకటిగా నిలిచింది. దీనికి సాహిత్యం రాజా మెహదీ అలీ ఖాన్ అందించగా.. సంగీత దర్శకుడిగా మదన్ మోహన్ పని చేశారు.
బహోన్ మే చలే ఆవో
బహోన్ మే చలే ఆవో అనే పాట అనామిక (1973) చిత్రంలోనిది.. ఈ పాటను మజ్రూహ్ సుల్తాన్పురి రాశారు. రాహుల్ దేవ్ బర్మన్ సంగీతం సమకూర్చారు.
పాకీజా నుండి చల్తే చల్తే
ఈ పాటతో లతా మంగేష్కర్ మరోసారి ప్రేక్షకులు హృదయాలను గెలుచుకున్నారు. గైడ్ సినిమాలోని పియా తోసే.. సాంగ్. 2022లో కూడా ఈ పాట సంగీత ప్రియులను అలరిస్తుంది. ఇది బాలీవుడ్ లో మోస్ట్ రొమాంటిగ్ సాంగ్ లో ఒకటి. ఆరాధన నుండి కోరా కాగజ్ థా యే మన్ మేరా అనే సాంగ్ ఆల్ టైం హిట్ గా నిలిచింది.
దిల్వాలే దుల్హనియా లే జాయేంగే నుండి తుజే దేఖా యో యే జానా సనాం సాంగ్. ఈ పాట ప్రస్తుతం కూడా తెగ వైరల్ అవుతూ ఉంటుంది. అన్ఫధ్ సినిమాలోని ఆప్ కి నజ్రోన్ నే సంఝా సాంగ్ ను లతా మంగేష్కర్ 1962లో విడుదలైన అన్పధ్ చిత్రం కోసం పాడారు.
ఏ మేరే వతన్ కే లోగోన్ అనే పాటను ఆలపించారు లతా మంగేష్కర్. ఈ పాట విని అప్పటి ప్రధాని నెహ్రూ కూడా కన్నీటి పర్యంతం అయ్యారు. దిల్ సే నుండి జియా జలే సాంగ్.. సత్యం శివం సుందరం నుంచి అదే పేరుతో ఉన్న పాటను పాడారు. కభీ ఖుషీ కభీ ఘమ్ సినిమాలో టైటిల్ ట్రాక్ ను ఆలపించారు. ఇలా ఈ పాటలే కాకుండా.. ఇప్పటికే ఎప్పటికీ ప్రతీ ప్రేక్షకుడి మదిలో నిలిచే ఎన్నో పాటలను ఆలపించారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…