సాధారణంగా ఎక్కడైనా తల్లి అంటే పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. తను తిన్నా తినకపోయినా పిల్లల కడుపు నిండాలని ఆలోచిస్తోంది. కన్నబిడ్డలకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలని అనుకోవడంతో పాటు పిల్లలు ఉన్నత స్థానాల్లో స్థిరపడాలని తల్లి భావిస్తుంది. అయితే ఒక మహిళ మాత్రం కన్న కూతురు వేళ్లను కొరుక్కుని తింది. కన్న కూతురుతో అంత దారుణంగా ప్రవర్తిస్తోందంటే ఆ తల్లి ఎంతటి క్రూరురాలో సులభంగా అర్థమవుతుంది. కానీ ఆ మహిళ మాత్రం కూతురు వేళ్లను సరదా కోసం తిన్నట్టు నటించింది.
పూర్తి వివరాల్లోకి వెళితే అమెరికాలోని కాన్సాస్ లో ఒక మహిళ తన కూతురుతో కలిసి నివశించేది. కూతురు జోషఫైన్ చార్లీని సరదాగా ఆట పట్టించాలని భావించిన ఆ తల్లి వేళ్లను నోట్లో పెట్టుకుని నిజంగానే కొరుక్కుని తిన్నట్టు నటించింది. ఏమీ తెలియని అమాయకురాలైన పాప నిజంగానే తల్లి చేతివేళ్లను కొరుక్కును తినిందని భావించి ఏడుపు పెట్టింది. తల్లి ఇన్స్టాగ్రామ్ లో ఈ వీడియో షేర్ చేయగా సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.
తల్లి కూతురు చేతి వేళ్లను తిన్నట్టు నటించిన ఆ తల్లి ఆ వీడియోకు చేతి వేళ్లు తిన్నందుకు తన కూతురుకు కోపంగా ఉందని క్యాప్షన్ ను జోడించింది. సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతుండగా ఈ వీడియోకు వేల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. నిన్న ఈ వీడియోలో సోషల్ మీడియాలో పోస్ట్ నెటిజన్లు ఈ వీడియోకు ఫన్నీ కామెంట్లు జోడిస్తున్నారు. ఆ పిల్ల మరీ అమాయకురాలిలా ఉందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మరి కొందరు మాత్రం తల్లి పిల్లను అంతలా ఏడిపించడం ఏంటని సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు ఆ కాలానికి ఈ కాలానికి పిల్లల్లో, తల్లుల్లో చాలా మార్పు వచ్చిందంటూ కామెంట్లు చేస్తున్నారు.
వేసవి కాలంలో దాహం ఎక్కువగా ఉండటం సహజం. అందుకే ఎక్కువ నీళ్లు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. అయితే “అధికం…
ఆధునిక జీవనశైలిలో ఫాస్ట్ ఫుడ్, రెడీమేడ్ ఆహారాలకు అలవాటు పడుతున్న తరుణంలో సంప్రదాయ వంటకాల ప్రాముఖ్యత మళ్లీ పెరుగుతోంది. ఆరోగ్యాన్ని…
ఆరోగ్యకరమైన జీవనశైలికి సరైన ఆహారం కీలకం. చిన్న మార్పులతోనే పెద్ద ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా మంది…
నరసింహ జయంతి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో ఒకటిగా భావించబడుతుంది. శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంగా అవతరించిన రోజుని…
భక్తి మార్గంలో నడిచిన మహానుభావుల కథలు ఎప్పటికీ ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. అలాంటి అరుదైన భక్తురాళ్లలో తరిగొండ వెంగమాంబ ఒకరు.…
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వాటిలో బుధుడు ముఖ్యమైన గ్రహంగా పరిగణించబడతాడు. బుద్ధి, వ్యాపారం, సంభాషణలకు…