Featured

ఏపీ రైతులకు జగన్ గుడ్ న్యూస్.. ఖాతాల్లో నగదు జమ చేయనున్న ప్రభుత్వం..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ జలకళ, రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు అనేక విధాలుగా జగన్ సర్కార్ ప్రయోజనం చేకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ పథకాల ద్వారా రాష్ట్రంలోని రైతులు లబ్ధి పొందుతున్నారు. తాజాగా జగన్ సర్కార్ రైతులకు రెండు శుభవార్తలు చెప్పింది.

వైఎస్సార్ జలకళ స్కీమ్ కు సంబంధించిన నిబంధనలలో జగన్ సర్కార్ కీలక మార్పులు చేసింది. సవరించిన నిబంధనల ప్రకారం రైటైర్ అయిన ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు వైఎస్సార్ జలకళ స్కీమ్ కు అర్హత పొందలేరు. రెండున్నర ఎకరాల భూమి ఉన్న రైతులు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రెండున్నర ఎకరాల భూమి లేకపోతే రైతులు గ్రూపుగా ఏర్పడి వైఎస్సార్ జలకళ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

అయితే ఒక కుటుంబంలో ఒకరు ఈ స్కీమ్ కు అర్హత పొందితే మరొకరు ఈ స్కీమ్ కు అర్హత పొందలేరు. మరోవైపు జగన్ సర్కార్ రాష్ట్రంలో నేటి నుంచి వైఎస్సార్ పంటల బీమా స్కీమ్ ను అమలు చేస్తోంది. రాష్ట్రంలోని 9.50 లక్షల మంది రైతులకు ఈ స్కీమ్ ద్వారా ప్రభుత్వం ప్రయోజనం కల్పిస్తుండగా 1252 కోట్ల రూపాయలు బీమా పరిహారం రూపంలో రైతులకు అందుతుంది. బీమా పొందిన రైతులకు వారి మొబైల్ ఫోన్లకు సందేశాలు వస్తాయి.

జగన్ సర్కార్ ప్రతి ఎకరాన్ని ఈ క్రాప్ లో నమోదు చేయించడంతో పాటు నష్టపోయిన రైతులకు ఖాతాలలో నగదును జమ చేస్తోంది. ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి నగదు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలలో జమవుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

21 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

22 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago