Featured

ఏపీ రైతులకు జగన్ గుడ్ న్యూస్.. ఖాతాల్లో నగదు జమ చేయనున్న ప్రభుత్వం..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. ఇప్పటికే వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ జలకళ, రైతుభరోసా కేంద్రాల ద్వారా రైతులకు అనేక విధాలుగా జగన్ సర్కార్ ప్రయోజనం చేకూరుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ పథకాల ద్వారా రాష్ట్రంలోని రైతులు లబ్ధి పొందుతున్నారు. తాజాగా జగన్ సర్కార్ రైతులకు రెండు శుభవార్తలు చెప్పింది.

వైఎస్సార్ జలకళ స్కీమ్ కు సంబంధించిన నిబంధనలలో జగన్ సర్కార్ కీలక మార్పులు చేసింది. సవరించిన నిబంధనల ప్రకారం రైటైర్ అయిన ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు వైఎస్సార్ జలకళ స్కీమ్ కు అర్హత పొందలేరు. రెండున్నర ఎకరాల భూమి ఉన్న రైతులు ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రెండున్నర ఎకరాల భూమి లేకపోతే రైతులు గ్రూపుగా ఏర్పడి వైఎస్సార్ జలకళ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

అయితే ఒక కుటుంబంలో ఒకరు ఈ స్కీమ్ కు అర్హత పొందితే మరొకరు ఈ స్కీమ్ కు అర్హత పొందలేరు. మరోవైపు జగన్ సర్కార్ రాష్ట్రంలో నేటి నుంచి వైఎస్సార్ పంటల బీమా స్కీమ్ ను అమలు చేస్తోంది. రాష్ట్రంలోని 9.50 లక్షల మంది రైతులకు ఈ స్కీమ్ ద్వారా ప్రభుత్వం ప్రయోజనం కల్పిస్తుండగా 1252 కోట్ల రూపాయలు బీమా పరిహారం రూపంలో రైతులకు అందుతుంది. బీమా పొందిన రైతులకు వారి మొబైల్ ఫోన్లకు సందేశాలు వస్తాయి.

జగన్ సర్కార్ ప్రతి ఎకరాన్ని ఈ క్రాప్ లో నమోదు చేయించడంతో పాటు నష్టపోయిన రైతులకు ఖాతాలలో నగదును జమ చేస్తోంది. ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి నగదు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలలో జమవుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

దేవాలయానికి వెళ్లే ముందు ధ్వజస్తంభానికి నమస్కారం ఎందుకు?

హిందూ దేవాలయ నిర్మాణంలో కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు, సంప్రదాయాలు తరతరాలుగా కొనసాగుతున్నాయి. అందులో ముఖ్యమైనది ధ్వజస్తంభం ఏర్పాటు. ఏ ఆలయానికి…

19 minutes ago

మీ జీవితంలో సమస్యలు పెరుగుతున్నాయా? శని ప్రభావం కారణమా?

జ్యోతిష్య విశ్వాసాల్లో శని Dev ప్రత్యేక స్థానం కలిగిన దేవతగా భావిస్తారు. కర్మకు తగిన ఫలితాన్ని ఇచ్చే న్యాయదేవుడిగా ఆయనను…

30 minutes ago

శ్రీశైలంలో ఎస్సీ కమిషన్ చైర్మన్ దర్శనం… ఆలయంలో ఘన స్వాగతం!

అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ప్రముఖ స్థానం కలిగిన Srisailam Temple క్షేత్రానికి భక్తుల రాకపోకలు ఎప్పుడూ కొనసాగుతూనే…

44 minutes ago

మైగ్రేన్‌తో బాధపడుతున్నారా? ఈ అలవాట్లు వెంటనే మార్చండి!

తలనొప్పి అనగానే చాలామంది సాధారణ సమస్యగా తీసుకుంటారు. కానీ ఒక వైపున గుచ్చినట్లుగా తీవ్రంగా వచ్చే నొప్పి, దానికి తోడు…

52 minutes ago

శరీరాన్ని కూల్‌గా ఉంచే పవర్ డ్రింక్… సమ్మర్ స్పెషల్ జ్యూస్… హెల్త్ & టేస్ట్ ఒకేసారి!

వేసవికాలం మొదలైనప్పుడల్లా శరీరాన్ని చల్లగా ఉంచే పానీయాల కోసం చాలా మంది వెతుకుతుంటారు. బయట దొరికే కూల్‌డ్రింక్స్‌ తాత్కాలికంగా చల్లదనం…

59 minutes ago

వందేళ్ల పాత రుచి… రాయలసీమ స్పెషల్‌ వట్టి తునకల మేజిక్!

తెలుగు వంటల్లో పాతకాలపు రుచులకు ప్రత్యేక స్థానం ఉంది. కాలం మారుతున్న కొద్దీ కొత్త రకాల ఫుడ్ అలవాట్లు పెరిగినా,…

1 hour ago