Mother killed daughter : మొన్నటికి మొన్న రెండో భర్తతో తన కన్నబిడ్డలను అత్యాచారం చేయించిన ఒక తల్లిని చూస్తే నేడు ఏకంగా ప్రియుడి మోజులో పడి పసిబిడ్డను గరిటతో కొట్టి చంపింది ఓ కన్న తల్లి. ఏ బిడ్డ అయినా ఈ ప్రపంచంలో సురక్షితంగా ఉండేది అమ్మ దగ్గరే అలాంటి అమ్మే బిడ్డను కడతేరిస్తే ఇక ఆ బిడ్డకు రక్షణ ఎక్కడ. కన్న తల్లినీ నమ్మే పరిస్థితి లేని లోకంలో నేడు మనం జీవిస్తున్నాం. సమాజంలో జరుగుతున్న ఇలాంటి సంఘటనలు ఆశ్చర్యంతో పాటు భయాన్ని కలిగిస్తున్నాయి. తాజాగా విశఖలో ఒక తల్లి తన పదిహేను నెలల పసికందును దోశ వేసే గారిటతో కొట్టి చంపేసిన ఘటన సంచలనం రికేత్తించింది.
అల్లరి చస్తోందని చంపేసిన స్వప్న…
విశాఖ గాజువాక కు చెందిన స్వప్న సుందరి అనే యువతికి వివాహం జరిగి పదిహేను నెలల పాప ఉండగా భర్తతో గొడవపడి విశాఖ మంగలపాలెం జీఎంఆర్ కాలనీలో ఓ గది అద్దెకు తీసుకొని నివాసం ఉంటోంది. ఆమెకు తన బంధువైన రమణ బాబు అనే వ్యక్తితో సన్నిహిత సంబంధం ఉండగా అతను భర్త అంటూ చెప్పి ఇల్లు అద్దెకు తీసుకుంది. జులై 17న సోమవారం నాడు పాప గీతాశ్రీ అల్లరి చేస్తుండగా కోపంతో పాపను తల మీద గరిటతో కొట్టింది స్వప్న. దీంతో కాసేపటికే పాప చనిపోయింది.
పాప చనిపోయాక బయపడిన స్వప్న ప్రియుడు రమణ బాబు తో కలిసి అపార్ట్మెంట్ వెనుక మట్టిలో పూడ్చేసింది. కుక్కలు మట్టిని తోడి పాప శవాన్ని పీక్కుతినడంతో స్థానికులకు దుర్గంధం వచ్చి చూడగా పాప శవం కనిపించింది. దీంతో పోలీసులకు ఫోన్ చేయగా పాప తల్లి చంపినట్లుగా తేలింది. పాపను కొన్నిసార్లు చూసినా పాప లేదని తెలిసి పక్కింటివాళ్ళు సైతం కన్నీరు పెట్టుకుంటుడాగా స్వప్న మీద ఆమె తల్లి కేసు పెట్టడం విశేషం. తొమ్మిది నెలలు మోసి కన్న పాపను తన చేతులతో ఎలా చంపిదో అని అక్కడి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…