Mother killed daughter : మొన్నటికి మొన్న రెండో భర్తతో తన కన్నబిడ్డలను అత్యాచారం చేయించిన ఒక తల్లిని చూస్తే నేడు ఏకంగా ప్రియుడి మోజులో పడి పసిబిడ్డను గరిటతో కొట్టి చంపింది ఓ కన్న తల్లి. ఏ బిడ్డ అయినా ఈ ప్రపంచంలో సురక్షితంగా ఉండేది అమ్మ దగ్గరే అలాంటి అమ్మే బిడ్డను కడతేరిస్తే ఇక ఆ బిడ్డకు రక్షణ ఎక్కడ. కన్న తల్లినీ నమ్మే పరిస్థితి లేని లోకంలో నేడు మనం జీవిస్తున్నాం. సమాజంలో జరుగుతున్న ఇలాంటి సంఘటనలు ఆశ్చర్యంతో పాటు భయాన్ని కలిగిస్తున్నాయి. తాజాగా విశఖలో ఒక తల్లి తన పదిహేను నెలల పసికందును దోశ వేసే గారిటతో కొట్టి చంపేసిన ఘటన సంచలనం రికేత్తించింది.
అల్లరి చస్తోందని చంపేసిన స్వప్న…
విశాఖ గాజువాక కు చెందిన స్వప్న సుందరి అనే యువతికి వివాహం జరిగి పదిహేను నెలల పాప ఉండగా భర్తతో గొడవపడి విశాఖ మంగలపాలెం జీఎంఆర్ కాలనీలో ఓ గది అద్దెకు తీసుకొని నివాసం ఉంటోంది. ఆమెకు తన బంధువైన రమణ బాబు అనే వ్యక్తితో సన్నిహిత సంబంధం ఉండగా అతను భర్త అంటూ చెప్పి ఇల్లు అద్దెకు తీసుకుంది. జులై 17న సోమవారం నాడు పాప గీతాశ్రీ అల్లరి చేస్తుండగా కోపంతో పాపను తల మీద గరిటతో కొట్టింది స్వప్న. దీంతో కాసేపటికే పాప చనిపోయింది.
పాప చనిపోయాక బయపడిన స్వప్న ప్రియుడు రమణ బాబు తో కలిసి అపార్ట్మెంట్ వెనుక మట్టిలో పూడ్చేసింది. కుక్కలు మట్టిని తోడి పాప శవాన్ని పీక్కుతినడంతో స్థానికులకు దుర్గంధం వచ్చి చూడగా పాప శవం కనిపించింది. దీంతో పోలీసులకు ఫోన్ చేయగా పాప తల్లి చంపినట్లుగా తేలింది. పాపను కొన్నిసార్లు చూసినా పాప లేదని తెలిసి పక్కింటివాళ్ళు సైతం కన్నీరు పెట్టుకుంటుడాగా స్వప్న మీద ఆమె తల్లి కేసు పెట్టడం విశేషం. తొమ్మిది నెలలు మోసి కన్న పాపను తన చేతులతో ఎలా చంపిదో అని అక్కడి స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…