Political News

ఏకంగా ఎంపీ మెడలో చైన్ లాకెళ్లిన దొంగలు! ఎంపీ గాయాలు !

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహిళల భద్రత మరోసారి ప్రశ్నార్థకంగా మారింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే చాణక్యపూరి ప్రాంతంలో, తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ సుధా రామకృష్ణన్ దొంగల బారిన పడ్డారు. ఈ ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును గుర్తుతెలియని దుండగులు లాక్కెళ్లారు.

సోమవారం ఉదయం సుధా రామకృష్ణన్ తన సహచర ఎంపీతో కలిసి చాణక్యపూరిలోని పోలాండ్ రాయబార కార్యాలయం సమీపంలో నడుస్తున్నారు. ఈ సమయంలో హెల్మెట్ ధరించిన ఒక వ్యక్తి స్కూటీపై వచ్చి ఆమె మెడలో ఉన్న గొలుసును లాక్కెళ్లాడు. ఈ దాడిలో ఆమెకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం.

ఈ ఘటనతో షాక్‌కు గురైన ఆమె వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

ఒక పార్లమెంట్ సభ్యురాలిపైనే ఇటువంటి దాడి జరగడంపై ప్రజల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా దౌత్య కార్యాలయాలు, ఉన్నతాధికారుల నివాసాలు ఉండే చాణక్యపూరి వంటి హై-సెక్యూరిటీ జోన్‌లోనే ఈ ఘటన జరగడం ఢిల్లీ భద్రతా ఏర్పాట్లపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు కూడా సుధా రామకృష్ణన్ లేఖ రాసినట్లు తెలిసింది.

telugudesk

Recent Posts

44 డిగ్రీలకు చేరే ఉష్ణోగ్రతలు.. మూడు రోజులు హెచ్చరిక

తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…

10 hours ago

ప్రభాస్ ‘ఫౌజీ’ ఛాన్స్ వదిలేసిన టాలీవుడ్ హీరో ఎవరు?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…

11 hours ago

180 బాధితులు.. దేశాన్ని షాక్‌కు గురిచేసిన ఘటన

మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…

11 hours ago

వరుణ్ తేజ్ గాయం.. నిహారిక ఎమోషనల్ ప్రెస్ నోట్

టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…

11 hours ago

అటెండర్ మాస్టర్ ప్లాన్.. SBIకి రూ.2.65 కోట్ల షాక్!

తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…

14 hours ago

ఎన్నికల వేళ ఆస్తుల వివాదం.. ఉదయనిధిపై విచారణ

తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…

14 hours ago