Mr. Tea Naveen Reddy, Vaishali Issue : రంగారెడ్డి జిల్లా ఆధిభట్లలో జరిగిన ఒక కిడ్నాప్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సినిమా లెవెల్లో వందమందితో వచ్చి ఒక అమ్మాయిని ఎత్తుకెళ్లారు. అడ్డొచ్చిన వారిని కొట్టి ఆ ఇంటివద్ద సీసీ కెమెరాలను ధ్వంసం చేసి నానా హంగామా చేసి యువతిని కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. కానీ ఈ కిడ్నాప్ విషయంలో లోతుకి వెళితే అక్కడే మరిన్ని ట్విస్టులు వెలుగులోకి వచ్చాయి. ఇక కిడ్నాప్ చేయించిన నవీన్ రెడ్డి బ్యాక్ గ్రౌండ్ చూసి అందరూ ఆశ్చర్య పోతున్నారు. దౌర్జన్యంగా ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసారని తొలుత భావించినా నిజానికి ఆ అమ్మాయికి నవీన్ రెడ్డికి అంతకుముందే ప్రేమ వ్యవహారం ఉందంటూ ఆ అమ్మాయికి కాస్ట్లి కారు గిఫ్ట్ ఇచ్చాడు అంటూ బయట ప్రచారం జరుగుతోంది. ఇక వ్యాపారవేత్తగా చిన్న వయసులోనే సక్సెస్ అయిన నవీన్ రెడ్డి ఈ ఒక్క సంఘటనతో ఒక్కసారిగా తాను తెచ్చుకున్న మంచి పేరును చెడగొట్టుకున్నాడు.
నవీన్ రెడ్డి అరెస్ట్…
కిడ్నాప్ కేసులో ఇప్పటివరకు పోలీసులు దాదాపు 32 మందిని అరెస్టు చేయగా మిగిలిన వాళ్ళు ఇంకా పరారీలో ఉన్నారు. ఇక ఈ కేసులో ఏ1 గా ఉన్నా నవీన్ రెడ్డి ని పోలీసులు అరెస్టు చేసారంటూ ఓవైపు ప్రచారం జరుగుతున్నా నవీన్ రెడ్డి ని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పడం లేదు. పోలీసులు నవీన్ రెడ్డి ని అరెస్టు చేసినా చేయలేదని చెప్తున్నారంటూ మరో వాదన వినిపిస్తోంది. ఇక నవీన్ రెడ్డి ఇంటి దగ్గర స్థానికులు మాత్రం నవీన్ ను పోలీసులు అరెస్టు చేసారు కానీ బయటకు చెప్పడం లేదు అంటూ అభిప్రాయపడుతున్నారు.
నిజానికి నవీన్ పరారీలో ఉన్నాడు ఇంకా ఆచూకీ లభించలేదు అంటూ పోలీసులు చెబుతున్న మాటల్లో నిజమెంతో తెలియదు. ఇక వైశాలి ఇంటి వద్ద పోలీసులు కాపలా కస్తున్నారు. మీడియా వాళ్ళను కూడా అనుమతించడం లేదు. వైశాలి ఆల్రడీ చెప్పాలిసింది చెప్పేసిందని ఇక మాట్లాడదంటూ ఆమె కుటుంబసభ్యులు చెబుతున్నారు. వైశాలి బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ మాట్లాడాటానికి నిరాకరిస్తున్నారు. అయితే ఈ ఇష్యూలో ఇంకా మున్ముందు ఏం జరుగుతోంది అన్న ఆసక్తి అందరూలోనూ ఉన్నది.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…