Political News

Murali Mohan : చంద్రబాబు చేసిన పెద్ద తప్పు అదే.. దాని వల్లే రాష్ట్రం విడిపోయింది. : మురళి మోహన్

Murali Mohan : రాజకీయాలకు, సినిమాలకు మధ్య విడదీయ్యరాని బంధం ఉంది. రామారావుగారు రాజకీయాల్లోకి వచ్చినపుడు మొఖానికి రంగేసుకునే వాళ్ళు రాజకీయాలకు పనికిరారని విమర్శలొచ్చాయి. కానీ రామారావు గారు సొంత పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యాక సినిమా వాళ్ళు చాలా మంది రాజకీయాలవైపు అడుగులేసారు. అటు తమిళ నాడు రాజకీయాల్లోనూ సినిమా వాళ్లే ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఇక చాలా మాది సినిమా ప్రముఖులు ఎంపీలు, ఎమ్మెల్యే లుగా రాజకీయాల్లో రాణించారు. అలాంటి వారిలో మాగంటి మురళి మోహన్ గారు ఒకరు. సినిమాల నుండి రాజకీయాలవైపు వచ్చిన ఆయన టీడీపీ పార్టీ తరుపున ఎన్నికై ఎంపీ గా సేవాలందించారు. ప్రస్తుతం ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నా కూడా ఒకప్పుడు టీడీపీ తీసుకున్న చారిత్రాత్మక తప్పిదాల గురించి మాట్లాడారు.

ఆరోజు చంద్రబాబు అలా చేయడం తప్పే…

అందరికీ తెలిసిన విషయమే చంద్రబాబు నాయుడు గారికి కెసిఆర్ శిష్యుడు. ఒకప్పుడు టీడీపీ లో ఉన్న కెసిఆర్, చంద్రబాబు నాయుడు తన కేబినెట్ లో మంత్రి పదవి ఇవ్వకపోవడంతో వేరు కుంపటి పెట్టి చివరకు తెరాస పార్టీ స్థాపించి ఆ తరువాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. ఇక ఈ విషయం లో చంద్రబాబు నాయుడు గారు పొరపాటు చేసారని మురళి మోహన్ గారు ఒప్పుకున్నారు. కెసిఆర్ తో పాటు ఆనాడు విజయ రామారావు గారు ఉన్నారు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు, అయితే విజయ రామారావు గారు మాజీ సిబిఐ ఆఫీసర్ అవడంతో చదువుకున్న వ్యక్తి నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ రాజకీయాల్లో ఉండాలని ఆయనను రాజకీయాల్లోకి చంద్రబాబు గారే ఆహ్వానించడం ఆయన ఎమ్మెల్యే అవ్వడం జరిగింది.

ఇక చదువుకున్న ఒక నిజాయితీ వ్యక్తి మంత్రి అయితే బాగుంటుందని కెసిఆర్ ను కాదని విజయ రామారావు కి మంత్రి పదవి ఇచ్చారు. దీంతో కెసిఆర్ గారు వేరు కుంపటి పెట్టారు అని వివరించారు. దాని వల్లే ఈనాడు రాష్ట్ర విభజన జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. విభజిత ఆంధ్రప్రదేశ్ కి సీఎం అయ్యాక కష్టపడ్డారు కానీ ఉద్యోగులతో నిరంతరం సమీక్ష లు నిర్వహించడం వారిని అభిప్రాయాలను అడగకుండా ఈయనే చెప్పడం వంటివి ఆయనకు వ్యతిరేకతను తెచ్చిపెట్టాయి. ఇవన్నీ ఆయన పొరపాట్లే కానీ, తప్పులు కాదు ఆయన స్వలాభం కోసం చేయలేదు రాష్ట్రాన్ని దోచుకోలేదు కదా అని అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

Supreme Court : మహిళ దుస్తులు లాగినా, వక్షోజాలు తాకినా.. అది అత్యాచార యత్నమే.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…

6 hours ago

యూత్ టచ్ కావాలంటున్న విక్రమ్.. కొత్త ప్రాజెక్టులు యువతకు ఫోకస్

సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…

7 hours ago

ఉచిత బస్సు ప్రయాణానికి కొత్త రూల్స్.. ఇక ఆధార్ కాదు… స్మార్ట్ కార్డ్ తప్పనిసరి!

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…

8 hours ago

సీనియర్ల రూట్లో రష్మిక.. పెళ్లి, సినిమాలు, కమిట్‌మెంట్స్.. ఒక్కసారే!

రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…

8 hours ago

నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలి

ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…

9 hours ago

AI రంగంలో అదానీ భారీ ప్లాన్.. 2035 నాటికి రూ.8 లక్షల కోట్ల పెట్టుబడి!

భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…

9 hours ago