Featured

Murali Mohan : డైరెక్టర్ తేజతో గొడవ అసలేమైందంటే… ప్రకాష్ రాజ్ ను నిలదీసాను… జీవితంలో అదొక బ్లాక్ మార్క్…!

Murali Mohan : తెలుగు పరిశ్రమలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నిర్మాతగా మురళీ మోహన్ అందరికీ తెలుసు. ఏమాత్రం బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోగా చిన్న సినిమాలతో మొదలై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక జయభేరి సంస్థను స్థాపించి అనేక సినిమాలను నిర్మించారు. తన సినిమాలతో కొత్త హీరోయిన్లను పరిచయం చేసిన మురళీ మోహన్ ఎన్నో సినిమాల్లో హీరోగా మెప్పించాడు. అప్పట్లో మధ్యతరగతి అమ్మాయిలకు అతనే డ్రీమ్ బాయ్. ఇక చాలా మందికి పక్కింటి కుర్రాడు, తమ సోదరుడు, తండ్రి లాంటి భావన కలిగించేలా ఆయన నటన సహజంగా ఉండేది. ఇప్పటికీ సహ నటుడుగా, సినిమాల్లో అడపా దడపా కనిపిస్తూ అలరిస్తున్న మురళీ మోహన్ జీవితంలోని ఒక బ్లాక్ మార్క్ ను గురించి మాట్లాడారు.

డైరెక్టర్ తేజతో నిజం సినిమా సమయంలో గొడవ…

మహేష్ బాబు, డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన నిజం సినిమాలో పోలీస్ అధికారి పాత్రలో మొదట మురళీ మోహన్ గారు చేసారు. కొంత షూటింగ్ అయ్యాక పాత్ర నెగెటివ్ షేడ్ ఉన్నది కావడంతో ఆయన సరిపోవడంలేదనిపించి ప్రకాష్ రాజతో రీప్లేస్ చేసారు. అయితే ఈ విషయం మురళీ మోహన్ గారికి చెప్పకుండా చేయడంతో ఆయన బాధపడ్డారట. అలాగే మొదటి సారి ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేశారట. ఇక డైరెక్టర్ తేజ క్షమాపణలు చెప్పడం జరిగింది.

ఇక ప్రకాష్ రాజ్ ను కూడా ఒక పాత్రలో ఆల్రెడీ ఒకరు చేస్తూ మధ్యలో వెళ్ళిపోతే కారణాలు తెలుసుకోకుండా నువ్వెలా ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్నావ్ అని అడిగారట, అయితే నాకసలు విషయం తెలియదని చెప్పారట. ఇక ఆ సినిమాలో కొంతకాలం పనిచేసిన దానికి పారితోషకం ఇవ్వానుకున్నా తీసుకోలేదని ఆ సంఘటన జీవితంలో ఒక బ్లాక్ మార్క్ లాగా నిలిచిపోయిందని చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago