Featured

Murali Mohan : డైరెక్టర్ తేజతో గొడవ అసలేమైందంటే… ప్రకాష్ రాజ్ ను నిలదీసాను… జీవితంలో అదొక బ్లాక్ మార్క్…!

Murali Mohan : తెలుగు పరిశ్రమలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నిర్మాతగా మురళీ మోహన్ అందరికీ తెలుసు. ఏమాత్రం బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోగా చిన్న సినిమాలతో మొదలై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక జయభేరి సంస్థను స్థాపించి అనేక సినిమాలను నిర్మించారు. తన సినిమాలతో కొత్త హీరోయిన్లను పరిచయం చేసిన మురళీ మోహన్ ఎన్నో సినిమాల్లో హీరోగా మెప్పించాడు. అప్పట్లో మధ్యతరగతి అమ్మాయిలకు అతనే డ్రీమ్ బాయ్. ఇక చాలా మందికి పక్కింటి కుర్రాడు, తమ సోదరుడు, తండ్రి లాంటి భావన కలిగించేలా ఆయన నటన సహజంగా ఉండేది. ఇప్పటికీ సహ నటుడుగా, సినిమాల్లో అడపా దడపా కనిపిస్తూ అలరిస్తున్న మురళీ మోహన్ జీవితంలోని ఒక బ్లాక్ మార్క్ ను గురించి మాట్లాడారు.

డైరెక్టర్ తేజతో నిజం సినిమా సమయంలో గొడవ…

మహేష్ బాబు, డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన నిజం సినిమాలో పోలీస్ అధికారి పాత్రలో మొదట మురళీ మోహన్ గారు చేసారు. కొంత షూటింగ్ అయ్యాక పాత్ర నెగెటివ్ షేడ్ ఉన్నది కావడంతో ఆయన సరిపోవడంలేదనిపించి ప్రకాష్ రాజతో రీప్లేస్ చేసారు. అయితే ఈ విషయం మురళీ మోహన్ గారికి చెప్పకుండా చేయడంతో ఆయన బాధపడ్డారట. అలాగే మొదటి సారి ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేశారట. ఇక డైరెక్టర్ తేజ క్షమాపణలు చెప్పడం జరిగింది.

ఇక ప్రకాష్ రాజ్ ను కూడా ఒక పాత్రలో ఆల్రెడీ ఒకరు చేస్తూ మధ్యలో వెళ్ళిపోతే కారణాలు తెలుసుకోకుండా నువ్వెలా ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్నావ్ అని అడిగారట, అయితే నాకసలు విషయం తెలియదని చెప్పారట. ఇక ఆ సినిమాలో కొంతకాలం పనిచేసిన దానికి పారితోషకం ఇవ్వానుకున్నా తీసుకోలేదని ఆ సంఘటన జీవితంలో ఒక బ్లాక్ మార్క్ లాగా నిలిచిపోయిందని చెప్పారు.

Bhargavi

Recent Posts

నైటీ వేసుకుందన్న కోపం.. భార్యపై నిప్పంటించిన భర్త

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…

8 hours ago

సైన్స్ vs నమ్మకాలు.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…

8 hours ago

మెగాస్టార్ ఇంటి పక్కనే అల్లు అర్జున్ కలల గృహం.. రూ.80 కోట్ల మేన్షన్ నిర్మాణం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…

8 hours ago

నాదెండ్ల భాస్కర్ రావు ఇకలేరు.. విభిన్న రాజకీయ ప్రయాణం ముగిసింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…

8 hours ago

స్టార్ హీరోలు కూతుళ్లను సినిమాల్లోకి ఎందుకు పంపరంటే.. జేడీ షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…

8 hours ago

పెళ్లి ముందు రాత్రే షూటింగ్..రమ్యకృష్ణ డెడికేషన్‌కు ఫిదా

సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…

8 hours ago