నిర్మాత నట్టి కుమార్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వివాదాలకు కారణం అవుతున్నారు. గత కొద్ది రోజుల నుంచి ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తున్న నట్టికుమార్ గతంలో చిరంజీవి ఇంట్లో పలువురు సినిమా పెద్దలతో జరిగిన సమావేశం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీలోని సమస్యల గురించి సమావేశం అయితే అందరిని అడిగి అందరి సమస్యలను తెలుసుకోవాలని కానీ చిరంజీవి అలా చేయకుండా కేవలం కొందరితో మాత్రమే సమావేశమయ్యారని, అసలు అది ఏ మీటింగో ఏమో ఎవరికి తెలియదు అంటూ అప్పుడు ఈ సమావేశం పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా తాజాగా నట్టికుమార్ థియేటర్స్ రెంట్, హీరోయిన్స్ రెమ్యూనరేషన్ పై కూడా ఇదే స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్ రేట్లు ఎంత పెరిగినా థియేటర్స్ రెంట్ మాత్రం అంతే ఉంటుంది. ఒక సినిమాను తెరకెక్కిస్తే ఐదుగురిని మనం పోషిస్తున్నట్లనీ, ఈ సందర్భంగా నిర్మాత నట్టి కుమార్ తెలియజేశారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం హీరోయిన్ల రెమ్యూనరేషన్లు గురించి కూడా ఈయన మాట్లాడారు.
ఒకప్పుడు ఎన్నో అద్భుతమైన సినిమాలలో ఎన్నో సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో నటించినటువంటి సౌందర్య గారికి 30 నుంచి 40 లక్షల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చేవారని, ఇప్పుడు నిన్నగాక మొన్న ఇండస్ట్రీలోకి వచ్చిన హీరోయిన్ కి ఏకంగా రెండు కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా రెండు కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ పూజా హెగ్డే పై వ్యాఖ్యానించారు నట్టి కుమార్.
రెమ్యూనరేషన్ మాత్రమే కాకుండా వారికి బాడీగార్డులు, హీరోయిన్ కి ప్రత్యేకమైన కారవాన్, వారి అసిస్టెంట్లకు ఒక కారవాన్ ఇలా కోట్లకు కోట్లు ఖర్చు పెడుతున్నారంటూ ఆయన ఈ విషయంపై ఘాటుగా స్పందించారు. ఇదంతా ప్రజల సొమ్ము, ఈ పద్ధతిలో మార్పు రావాలని ఈ సందర్భంగా నటి నిర్మాత హీరోయిన్ల రెమ్యూనరేషన్ పై ఈ విధంగా స్పందించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…