యంగ్ హీరో నాగశౌర్య, హీరోయిన్ రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసింది చిత్రబృందం. దసరా రోజు అంటే అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. పెళ్లి చూపులు బ్యూటీ రీతూ వర్మ హీరోయిన్గా చేస్తోన్న విషయం తెలిసిందే.
ఇప్పటికే రీతు వర్మ నాని సరసన నటించిన టక్ జగదీశ్ హిట్ టాక్ తెచ్చుకుంది. టక్ జగదీశ్ తర్వాత రీతు వర్మ నటించిన సీనిమా ఇదే. ఇది కూడా దసరా నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేయనుంది. లేడీ డైరెక్టర్ లక్ష్మి సౌజన్య ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నదియా, మురళీశర్మ, వెన్నెల కిశోర్, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైనమెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా మేకర్స్ వెల్లడించారు.
ఈ సినిమా నుంచి ఇప్పటికే ‘దిగు దిగు దిగు నాగ’ సాంగ్ విడుదల చేయగా.. ఓ రేంజిలో వ్యూస్ తెచ్చుకుంటోంది. ఈ పాట ఇప్పటి వరకు 16 మిలియన్ వ్యూస్ దక్కించుకుని సినిమాకు కావాలసిన ప్రమోషన్ను రాబట్టింది. దీనికి థమన్ సంగీతం వహించగా.. శేఖర్ మాస్టార్ కోరియోగ్రాఫర్ గా వహించాడు. ఈ పాటకు శ్రీరామ్ సాహిత్యాన్ని సమకూర్చారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని ఇప్పటికే చిత్రబృందం తెలిపింది.
కేరళలోని ప్రముఖ రిటైల్ స్పేస్ కంపెనీ హైలైట్ గ్రూప్ తన 30వ వార్షికోత్సవం సందర్భంగా ఉద్యోగులను అదిరిపోయే విధంగా సర్ప్రైజ్…
టీమిండియా నెక్స్ట్ జనరేషన్ స్టార్, 14 ఏళ్ల క్రికెట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు మోస్ట్ టాక్డ్ పేర్లలో ఒకరు.…
సర్పంచులకు ఉపశమనం.. నిలిచిన నిధుల వినియోగానికి అనుమతి ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. Government of…
ఉత్తరప్రదేశ్లోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలిచివేసే సంఘటన చోటుచేసుకుంది. బహ్రైచ్ జిల్లాలోని నంద్వాల్ గ్రామానికి చెందిన 35 ఏళ్ల గర్భిణి ప్రసవ…
తెలుగు చిత్రసీమలో కంటెంట్ ఆధారిత కథలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు తన కెరీర్లో సుహాస్ ఇప్పుడు…
టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా గుర్తింపు పొందిన రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన వ్యక్తిగత వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…