Nagababu: ఒకప్పుడు చిత్రపరిశ్రమలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న వారందరూ ఇండస్ట్రీలో సంపాదించినది మొత్తం పోగొట్టుకొని చివరికి ఎంతో దీన పరిస్థితులలో జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అయితే కొందరి పరిస్థితి చూసి చాలామంది ఆర్థిక సహాయం చేస్తూ వారికి భరోసా కల్పించగా మరికొందరు మాత్రం ఎలాంటి సహాయం అందక ఇతరుల సాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
ఇలా తెలుగు తమిళ సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి వాసుకి గురించి పరిచయం అవసరం లేదు అయితే తెలుగులో ఈమె పాకీజా పేరుతో ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇలా ఒకప్పుడు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది. గత కొద్ది రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన ఆర్థిక ఇబ్బందులు గురించి తెలిపారు.
తనకు కనీసం ఉండటానికి కూడా ఇల్లు లేదని పూట గడవడం కూడా కష్టంగా మారిందని తాను హాస్టల్లో ఉంటున్నానని తెలిపారు. అయితే ఈమె ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు చూసి చలించి పోయిన మెగా బ్రదర్ నాగబాబు ఈమెకు తక్షణమే లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయడమే కాకుండా తనకు సినిమాలలో చిన్నచిన్న పాత్రలలో అవకాశం కల్పించాలని తాను కూడా ప్రయత్నం చేస్తాను అంటూ తెలియజేశారు.
ఇలా నాగబాబు తనకు ఆర్థిక సహాయం చేశారని తెలియడంతో ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. నాగబాబు గారు తనకు ఎదురుగా ఉంటే కాళ్లకు దండం పెట్టేదాన్ని అని తెలిపారు.తమిళంలో తాను ఎన్నో సినిమాలలో చేసిన తనకు ఎవరూ కూడా ఒక ₹1000 కూడా ఆర్థిక సహాయం చేయలేదని ప్రస్తుతం తాను నాలుగు ముద్దలు తింటున్నాను అవి కేవలం తెలుగువారు, తెలుగు సినిమా పెట్టిన భోజనమేనని ఈ సందర్భంగా ఈమె ఎమోషనల్ అయ్యారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…