Nagababu: ఒకప్పుడు చిత్రపరిశ్రమలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న వారందరూ ఇండస్ట్రీలో సంపాదించినది మొత్తం పోగొట్టుకొని చివరికి ఎంతో దీన పరిస్థితులలో జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అయితే కొందరి పరిస్థితి చూసి చాలామంది ఆర్థిక సహాయం చేస్తూ వారికి భరోసా కల్పించగా మరికొందరు మాత్రం ఎలాంటి సహాయం అందక ఇతరుల సాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు.
ఇలా తెలుగు తమిళ సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి వాసుకి గురించి పరిచయం అవసరం లేదు అయితే తెలుగులో ఈమె పాకీజా పేరుతో ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇలా ఒకప్పుడు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె ప్రస్తుతం దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొంటుంది. గత కొద్ది రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన ఆర్థిక ఇబ్బందులు గురించి తెలిపారు.
తనకు కనీసం ఉండటానికి కూడా ఇల్లు లేదని పూట గడవడం కూడా కష్టంగా మారిందని తాను హాస్టల్లో ఉంటున్నానని తెలిపారు. అయితే ఈమె ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు చూసి చలించి పోయిన మెగా బ్రదర్ నాగబాబు ఈమెకు తక్షణమే లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయడమే కాకుండా తనకు సినిమాలలో చిన్నచిన్న పాత్రలలో అవకాశం కల్పించాలని తాను కూడా ప్రయత్నం చేస్తాను అంటూ తెలియజేశారు.
ఇలా నాగబాబు తనకు ఆర్థిక సహాయం చేశారని తెలియడంతో ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. నాగబాబు గారు తనకు ఎదురుగా ఉంటే కాళ్లకు దండం పెట్టేదాన్ని అని తెలిపారు.తమిళంలో తాను ఎన్నో సినిమాలలో చేసిన తనకు ఎవరూ కూడా ఒక ₹1000 కూడా ఆర్థిక సహాయం చేయలేదని ప్రస్తుతం తాను నాలుగు ముద్దలు తింటున్నాను అవి కేవలం తెలుగువారు, తెలుగు సినిమా పెట్టిన భోజనమేనని ఈ సందర్భంగా ఈమె ఎమోషనల్ అయ్యారు.
మన శరీరంలో కిడ్నీలు అత్యంత ముఖ్యమైన అవయవాలు. ఇవి రక్తంలో ఉన్న వ్యర్థాలను తొలగించడమే కాకుండా, శరీరంలో ద్రవాల సమతుల్యతను…
వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో కొన్ని మార్పులు సహజమే. అయితే ఇటీవల చాలా మందిలో కనిపిస్తున్న ఒక సమస్య నిపుణులను…
మన రోజువారీ వంటకాలలో నూనెకు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు దాదాపు ప్రతి…
మన దేశంలో చిన్నపిల్లల్లో తరచుగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్యల్లో రక్తహీనత ఒకటి. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లల్లో, అలాగే రెండు సంవత్సరాల…
2026 ఏప్రిల్ 15 బుధవారం రోజుకు సంబంధించిన రాశి ఫలితాలు ఈ రోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి…
గుజరాత్లోని సారంగపుర్ ప్రాంతంలో వెలసిన కష్టభంజన్ దేవ్ హనుమాన్ ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామి క్షేత్రాల్లో ఒకటి. భక్తులు…