Naga Chaitanya: ‘పెళ్ళంటే నూరేళ్ళ మంట.. డోంట్ మ్యారీ’ అంటూ మనసులో మాట బయటపెట్టిన నాగచైతన్య..! షాక్ లో నాగార్జున

Naga Chaitanya: సంక్రాంతి పండుగ సందర్భంగా బుల్లితెర ప్రేక్షకులను సందడి చేయడానికి ఏ ఒక్క ఛానల్ కూడా తగ్గేదే లే అన్నట్టుగా ప్రత్యేకమైన కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే నాగార్జున నాగచైతన్య కలిసి నటించిన బంగార్రాజు చిత్రం కూడా సంక్రాంతి కానుకగా విడుదల కావడంతో ఈ చిత్ర బృందం బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్యక్రమంలో పాల్గొని తమదైన శైలిలో సందడి చేశారు.

Naga Chaitanya: 'పెళ్ళంటే నూరేళ్ళ మంట.. డోంట్ మ్యారీ' అంటూ మనసులో మాట బయటపెట్టిన నాగచైతన్య..! షాక్ లో నాగార్జున

జీ తెలుగు బంగార్రాజుతో సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తాజాగా విడుదల చేసిన ప్రోమో ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో భాగంగా నాగార్జున నాగచైతన్య హీరోయిన్ కృతి శెట్టి వేదిక పైకి వచ్చారు.ఈ కార్యక్రమానికి ఉదయభాను యాంకర్ గా వ్యవహరించగా సుమ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తనదైన శైలిలో ప్రేక్షకులను సందడి చేశారు.

Naga Chaitanya: పెళ్ళంటే నూరేళ్ళ మంట.. డోంట్ మ్యారీ అంటున్న నాగచైతన్య..!

ఇక ఈ కార్యక్రమంలో అంత్యాక్షరీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో నాగార్జున టీమ్ ఒకవైపు నాగచైతన్య టీమ్ ఒకవైపు పోటీపడ్డారు. ఇలా ఈ రెండు టీమ్స్ పాటలు పాడుతూ పోటీపడుతుండగా వేదికపై నాగార్జున నటించిన మన్మధుడు చిత్రానికి సంబంధించిన ఫోటో ప్లే చేయడంతో వెంటనే నాగచైతన్య టీమ్ ఆ సినిమాకు సంబంధించిన పాట పాడారు..

డోంట్ మ్యారీ అంటున్న చైతూ…

ఈ సినిమాలోని వద్దురా.. సోదరా.. అంటూ సుమ పాట పాడటం ప్రారంభించగా అనంతరం నాగచైతన్య కూడా.. వారి టీమ్ తో కలిపి పాట పాడారు. ఈ క్రమంలోనే నాగచైతన్య కూడా డోంట్ మ్యారీ.. బీ హ్యాపీ అంటూ ఎంతో సంతోషంగా పాట పాడుతున్నారు.. అదే సమయంలో షాకింగ్ గా చూస్తున్నారు నాగార్జున. ఇక వీరిద్దరూ ఏంతో ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.