Saina Nehwal-Siddharth: సిద్ధార్థ్పై సైనా నెహ్వాల్ తండ్రి ఫైర్.. ‘‘నా కూతురు ఎంతో చేసింది.. నువ్వేం చేశావ్ అంటూ’’..
Saina Nehwal-Siddharth: యాక్టర్ సిద్ధార్థ్ సైనా నెహ్వాల్ పై చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇటీవల పంజాబ్ లో ఫిరోజ్ పూర్ పర్యటనలో ప్రధాని భద్రత వైఫల్యంపై స్పందిస్తూ… ఆ ఘటనను ఖండించింది సైనా నెహ్వాల్. అయితే ఈ వ్యాఖ్యలపై సిద్ధార్థ్.. సైనా నెహ్వాల్ ను ఉద్దేశిస్తూ..ట్విట్టర్ వేదికగా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మహిళలు, ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జాతీయ మహిళ కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ కూడా సిద్ధార్థ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధార్థ్ ట్విట్టర్ అకౌంట్ ను బ్లాక్ చేయాలని ట్విట్టర్ ఇండియాను కూడా ఆదేశించింది. మహారాష్ట్ర డీజీపీకి కూడా సిద్ధార్థ్ పై కేసులు పెట్టాలని ఆదేశాలు ఇచ్చింది.
ఈ విషయంపై సైనా నెహ్వాల్ తండ్రి హర్వీర్ సింగ్ ఫైర్ అయ్యారు. తన కుమార్తెపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించిన హర్వీర్ సింగ్.. దేశం కోసం సిద్ధార్థ్ ఏం చేశాడని ప్రశ్నించాడు. సైనాపై సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమన్నారు. `నా కూతురుని ఉద్దేశించి సిద్ధార్థ్ వ్యాఖ్యలు నిజంగా బాధాకరం. అసలు ఆయన దేశం కోసం ఏం చేశాడు? నా కుమార్తె దేశం కోసం పతకాలు గెలిచింది. దేశ ప్రతిష్టని పెంచిందని అన్నాడు.
బ్యాట్మింటన్ క్రీడాకారిణిగా అనేక పథకాలను దేశానికి తెచ్చింది సైనా నెహ్వాల్. 2012 లండన్ ఒలింపిక్స్లో సైనా కాంస్య పతకం గెలిచిన విషయం తెలిసిందే. ఇండియాకి ఆమె చేసిన సేవలకుగానూ 2009లో కేంద్ర ప్రభుత్వం అర్జున పురస్కారంతో, అలాగే మేజర్ ధ్యాన్చంద్, ఖేల్ రత్న అవార్డుని అందజేసింది. అలాగే 2010లో పద్మ శ్రీ పురస్కారం, 2016లో పద్మ భూషణ్ పురస్కారంతో గౌరవించింది. ఇదిలా ఉంటే సైనా నెహ్వాల్ ప్రస్తుతం బీజేపీలో సభ్యురాలిగా ఉన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…