Featured

Balakrishana: ‘వైఎస్ జగన్ మీ అభిమాని కదా.. ఆయనతో మాట్లాడొచ్చు కదా..’ అంటూ అడిగిన రిపోర్టర్ కి బాలయ్య దిమ్మతిరిగే రిప్లై..!

Balakrishana: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా విజయవంతం కావడం, అలాగే స్మాల్ స్క్రీన్ పై తన టాక్ షో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఫుల్ జోష్ లో ఉన్నారని చెప్పవచ్చు. ఇకపోతే కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న బాలకృష్ణ తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా అఖండ సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Balakrishana: మొట్టమొదటిసారి టికెట్ల వ్యవహారం పై స్పందించిన బాలయ్య.. ఏమన్నారంటే?

ఈ కార్యక్రమానికి అఖండ చిత్రబృందం కూడా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు బాలకృష్ణ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. అలాగే కొందరు రిపోర్టర్స్ ఏపీ టిక్కెట్ల రేట్లపై బాలయ్యను ప్రశ్నించగా ఈ వ్యవహారంపై బాలకృష్ణ మొట్టమొదటిసారిగా స్పందించారు.

Balakrishana: మొట్టమొదటిసారి టికెట్ల వ్యవహారం పై స్పందించిన బాలయ్య.. ఏమన్నారంటే?

ఇప్పటివరకు ఏపీ టికెట్ల వ్యవహారం పై పలువురు హీరోలు, కాంట్రవర్సీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్రస్థాయిలో వివాదాన్ని రేకెత్తించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల నుంచి ఏపీ ప్రభుత్వానికి, టాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమకు మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. అయితే ఈ వ్యవహారంపై ఒక్కసారి కూడా స్పందించని బాలకృష్ణ మొట్టమొదటిసారిగా టికెట్ల వ్యవహారంపై స్పందించారు.

Balakrishna : నా ఒక్కడి నిర్ణయం కాదు…

ఈ క్రమంలో రిపోర్టర్ ‘వైఎస్ జగన్ మీ అభిమాని కదా.. ఆయనతో మాట్లాడొచ్చు కదా.. మాట్లాడి టికెట్ల విషయం తెల్చొచ్చు కదా..’ అంటూ అడిగారు ఈ నేపధ్యంలో బాలకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ల రేట్లను తగ్గించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ విషయంపై నేనొక్కడినే అభిప్రాయం తీసుకోవడం కాదు ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే ఇండస్ట్రీకి చెందిన హీరోలు, ప్రొడ్యూసర్లు, ఫిలించాంబర్ మెంబర్స్, అసోసియేషన్ మెంబర్స్ అందరూ కలిసి కూర్చొని చర్చలు జరిపిన అనంతరం మన సమస్యలను తెలుసుకొని వాటిని ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చి ఈ సమస్యలను పరిష్కరించుకోవాలని ఇది ఏ ఒక్కరి అభిప్రాయం కాదని తెలిపారు. చలన చిత్ర పరిశ్రమ అంటే ప్రభుత్వానికి మంచి ఆదాయం తెచ్చి పరిశ్రమ కనుక ఈ వ్యవహారంపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని బాలకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago