Connect with us

Featured

Balakrishana: ‘వైఎస్ జగన్ మీ అభిమాని కదా.. ఆయనతో మాట్లాడొచ్చు కదా..’ అంటూ అడిగిన రిపోర్టర్ కి బాలయ్య దిమ్మతిరిగే రిప్లై..!

Balakrishana: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా విజయవంతం కావడం, అలాగే స్మాల్ స్క్రీన్ పై తన టాక్ షో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో

Published

on

Balakrishana: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా విజయవంతం కావడం, అలాగే స్మాల్ స్క్రీన్ పై తన టాక్ షో అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో ఫుల్ జోష్ లో ఉన్నారని చెప్పవచ్చు. ఇకపోతే కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న బాలకృష్ణ తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా అఖండ సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Balakrishana: మొట్టమొదటిసారి టికెట్ల వ్యవహారం పై స్పందించిన బాలయ్య.. ఏమన్నారంటే?

ఈ కార్యక్రమానికి అఖండ చిత్రబృందం కూడా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు బాలకృష్ణ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. అలాగే కొందరు రిపోర్టర్స్ ఏపీ టిక్కెట్ల రేట్లపై బాలయ్యను ప్రశ్నించగా ఈ వ్యవహారంపై బాలకృష్ణ మొట్టమొదటిసారిగా స్పందించారు.

Balakrishana: మొట్టమొదటిసారి టికెట్ల వ్యవహారం పై స్పందించిన బాలయ్య.. ఏమన్నారంటే?
Balakrishana: మొట్టమొదటిసారి టికెట్ల వ్యవహారం పై స్పందించిన బాలయ్య.. ఏమన్నారంటే?

ఇప్పటివరకు ఏపీ టికెట్ల వ్యవహారం పై పలువురు హీరోలు, కాంట్రవర్సీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్రస్థాయిలో వివాదాన్ని రేకెత్తించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల నుంచి ఏపీ ప్రభుత్వానికి, టాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమకు మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. అయితే ఈ వ్యవహారంపై ఒక్కసారి కూడా స్పందించని బాలకృష్ణ మొట్టమొదటిసారిగా టికెట్ల వ్యవహారంపై స్పందించారు.

Balakrishna : నా ఒక్కడి నిర్ణయం కాదు…

ఈ క్రమంలో రిపోర్టర్ ‘వైఎస్ జగన్ మీ అభిమాని కదా.. ఆయనతో మాట్లాడొచ్చు కదా.. మాట్లాడి టికెట్ల విషయం తెల్చొచ్చు కదా..’ అంటూ అడిగారు ఈ నేపధ్యంలో బాలకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ల రేట్లను తగ్గించిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ విషయంపై నేనొక్కడినే అభిప్రాయం తీసుకోవడం కాదు ఈ సమస్యకు పరిష్కారం కావాలంటే ఇండస్ట్రీకి చెందిన హీరోలు, ప్రొడ్యూసర్లు, ఫిలించాంబర్ మెంబర్స్, అసోసియేషన్ మెంబర్స్ అందరూ కలిసి కూర్చొని చర్చలు జరిపిన అనంతరం మన సమస్యలను తెలుసుకొని వాటిని ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చి ఈ సమస్యలను పరిష్కరించుకోవాలని ఇది ఏ ఒక్కరి అభిప్రాయం కాదని తెలిపారు. చలన చిత్ర పరిశ్రమ అంటే ప్రభుత్వానికి మంచి ఆదాయం తెచ్చి పరిశ్రమ కనుక ఈ వ్యవహారంపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని బాలకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Featured

Niharika: యుద్ధం గెలిచిన రాముడు అయోధ్యకు వచ్చినట్టు ఉంది… బాబాయ్ పై నిహారిక కామెంట్స్!

Published

on

Niharika: నిహారిక కొణిదెల పరిచయం అవసరం లేని పేరు. ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో నిర్మాతగా నటిగా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. తన భర్త నుంచి విడాకులు తీసుకొని విడిపోయిన నిహారిక తిరిగి కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే నిర్మాతగా కూడా కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇక నిహారిక నిర్మాణంలో తెరకెక్కిన కమిటీ కుర్రోళ్ళు సినిమా ఆగస్టు 9వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న సర్కార్ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఇక ఈ ప్రోమోలో భాగంగా నిహారిక పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ నేను వచ్చేది ఎప్పుడు నెక్స్ట్ సీజనా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సుడిగాలి సుదీర్ రెస్పాండ్ అవుతూ మీకేంటండి మీరు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ మాట్లాడారు. అనంతరం పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తర్వాత చిరంజీవి ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకున్న వీడియో ఎంతలా వైరల్ అయిందో మనకు తెలిసిందే .ఇక ఈ వీడియోని ప్లే చేశారు.

Advertisement

యుద్ధం గెలిచిన రాముడు…
ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది అంటూ నిహారికను ప్రశ్నించారు. ఇక నిహారిక ఈ వీడియో గురించి మాట్లాడుతూ యుద్ధం గెలిచిన తర్వాత శ్రీరాముడు అయోధ్యకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉండేదేమో అనిపించింది అంటూ తన బాబాయ్ విజయం గురించి నిహారిక మాట్లాడుతూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Anasuya: ఇకపై రంగమ్మత్త లాంటి పాత్రలు అసలు చేయను.. గ్లామర్ పాత్రలకు సై అంటున్న అనసూయ?

Published

on

Anasuya: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ అందుకొని అనంతరం వెండి తెరపై సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న అనసూయ తిరిగి బుల్లితెర కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈమె స్టార్ మా లో ప్రసారమవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడి లేడీస్ అనే కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా ఒక వైపు బుల్లితెర కార్యక్రమాలు మరోవైపు వెండితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న అనసూయ త్వరలోనే సింబా అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా ఈమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఇటీవల కాలంలో మీరు చాలా సినిమాలను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది కారణం ఏంటని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అనసూయ సమాధానం చెబుతూ తాను సినిమాలు రిజెక్ట్ చేస్తున్న మాట నిజమేనని తెలిపారు. నేను ఒక సినిమాలో నటించిన పాత్ర హిట్ అవడంతో తదుపరి సినిమాలలో కూడా అలాంటి పాత్రలలో నటించే అవకాశం వస్తుందని తెలిపారు.

Advertisement

రంగమ్మత్త..
ఇలా ఒక పాత్రలో నటించిన తర్వాత తిరిగి అలాంటి పాత్రలలో నటించిన ప్రేక్షకులు పెద్దగా తీసుకోలేరు ఉదాహరణకు రంగమ్మత్త పాత్ర చాలా హైలెట్ అయింది. తదుపరి అలాంటి పాత్రలు వస్తే నేను చెయ్యను నేను అన్ని చాలా డిఫరెంట్ గా ఉండేలా చేయాలని భావిస్తున్నాను. ఇక ఎక్కువగా తాను గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వాలని అనుకుంటున్నాను అంటూ ఈ సందర్భంగా అనసూయ గ్లామర్ రోల్ చేయడానికి సై అంటూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mahesh Babu: మహేష్ రాజమౌళి సినిమా టైటిల్ లీక్… సినిమా పేరు ఏంటో తెలుసా?

Published

on

Mahesh Babu: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేయబోతున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా జరుగబోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా తెలియజేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబు చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు మొదటిసారి వర్క్ షాప్ లో కూడా పాల్గొనబోతున్నారని సమాచారం.

ఇప్పటివరకు మహేష్ బాబు ఏ సినిమా కోసం ఇలా వర్క్ షాప్ లో పాల్గొనలేదు మొదటిసారి రాజమౌళి సినిమా కోసం పాల్గొనబోతున్న నేపథ్యంలో ఈయన కూడా ఈ సినిమా విషయంలో చాలా ఆతృత కనబరుస్తున్నారు. ఇకపోతే తాజాగా మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

గోల్డ్..
తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకు సంబంధించి ఓ టైటిల్ సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమా టైటిల్ కూడా అందుకు అనుగుణంగానే ఉండాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా కోసం గోల్డ్ అనే టైటిల్ పెట్టబోతున్నారంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. మరి ఈ సినిమా టైటిల్ గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!