Naga Chaitanya: సంక్రాంతి పండుగ సందర్భంగా బుల్లితెర ప్రేక్షకులను సందడి చేయడానికి ఏ ఒక్క ఛానల్ కూడా తగ్గేదే లే అన్నట్టుగా ప్రత్యేకమైన కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే నాగార్జున నాగచైతన్య కలిసి నటించిన బంగార్రాజు చిత్రం కూడా సంక్రాంతి కానుకగా విడుదల కావడంతో ఈ చిత్ర బృందం బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్యక్రమంలో పాల్గొని తమదైన శైలిలో సందడి చేశారు.
జీ తెలుగు బంగార్రాజుతో సంక్రాంతి సంబరాలు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తాజాగా విడుదల చేసిన ప్రోమో ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో భాగంగా నాగార్జున నాగచైతన్య హీరోయిన్ కృతి శెట్టి వేదిక పైకి వచ్చారు.ఈ కార్యక్రమానికి ఉదయభాను యాంకర్ గా వ్యవహరించగా సుమ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తనదైన శైలిలో ప్రేక్షకులను సందడి చేశారు.
ఇక ఈ కార్యక్రమంలో అంత్యాక్షరీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో నాగార్జున టీమ్ ఒకవైపు నాగచైతన్య టీమ్ ఒకవైపు పోటీపడ్డారు. ఇలా ఈ రెండు టీమ్స్ పాటలు పాడుతూ పోటీపడుతుండగా వేదికపై నాగార్జున నటించిన మన్మధుడు చిత్రానికి సంబంధించిన ఫోటో ప్లే చేయడంతో వెంటనే నాగచైతన్య టీమ్ ఆ సినిమాకు సంబంధించిన పాట పాడారు..
ఈ సినిమాలోని వద్దురా.. సోదరా.. అంటూ సుమ పాట పాడటం ప్రారంభించగా అనంతరం నాగచైతన్య కూడా.. వారి టీమ్ తో కలిపి పాట పాడారు. ఈ క్రమంలోనే నాగచైతన్య కూడా డోంట్ మ్యారీ.. బీ హ్యాపీ అంటూ ఎంతో సంతోషంగా పాట పాడుతున్నారు.. అదే సమయంలో షాకింగ్ గా చూస్తున్నారు నాగార్జున. ఇక వీరిద్దరూ ఏంతో ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…