Nagarjuna: రెండేళ్ల తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్న అక్కినేని దంపతులు..!
Nagarjuna: సాధారణంగా సినిమా సెలబ్రిటీలు వారి సినిమా విడుదల సమయంలోను లేత సినిమా హిట్ అయిన తర్వాత స్వామివారిని దర్శించుకోవడం చాలా మందికి ఆనవాయితీగా ఉంటుంది.ఈ క్రమంలోనే బంగార్రాజు సినిమా విడుదలైన తర్వాత నాగార్జున కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
ఈ క్రమంలోనే నాగార్జున ఆయన సతీమణి అమల స్వామివారి దర్శనార్థం తిరుమల చేరుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వారికి స్వాగతం పలికారు. శుక్రవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం ఇవ్వగా, ఆలయ అధికారులు పట్టువస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.స్వామివారి దర్శనం అనంతరం అక్కినేని నాగార్జున మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ…కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాలు స్వామివారి దర్శనం చేసుకోలేక పోయానని,ఇవాళ స్వామివారి ఆశీస్సులు పొందామని చెప్పారు. అలాగే ప్రపంచ ప్రజల అందరికి మంచి జరగాలని స్వామివారిని కోరుకున్నాననీ నాగార్జున చెప్పారు.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…