Nagarjuna: రెండేళ్ల తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్న అక్కినేని దంపతులు..!

Nagarjuna: రెండేళ్ల తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్న అక్కినేని దంపతులు..!

Nagarjuna: సాధారణంగా సినిమా సెలబ్రిటీలు వారి సినిమా విడుదల సమయంలోను లేత సినిమా హిట్ అయిన తర్వాత స్వామివారిని దర్శించుకోవడం చాలా మందికి ఆనవాయితీగా ఉంటుంది.ఈ క్రమంలోనే బంగార్రాజు సినిమా విడుదలైన తర్వాత నాగార్జున కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Nagarjuna: రెండేళ్ల తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్న అక్కినేని దంపతులు..!
Nagarjuna: రెండేళ్ల తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్న అక్కినేని దంపతులు..!

ఈ క్రమంలోనే నాగార్జున ఆయన సతీమణి అమల స్వామివారి దర్శనార్థం తిరుమల చేరుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వారికి స్వాగతం పలికారు. శుక్రవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

Nagarjuna: రెండేళ్ల తర్వాత స్వామివారి దర్శనం చేసుకున్న అక్కినేని దంపతులు..!

అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం ఇవ్వగా, ఆలయ అధికారులు పట్టువస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.స్వామివారి దర్శనం అనంతరం అక్కినేని నాగార్జున మీడియాతో మాట్లాడారు.

ప్రజలందరూ సంతోషంగా ఉండాలి..

ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ…కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాలు స్వామివారి దర్శనం చేసుకోలేక పోయానని,ఇవాళ స్వామివారి ఆశీస్సులు పొందామని చెప్పారు. అలాగే ప్రపంచ ప్రజల అందరికి మంచి జరగాలని స్వామివారిని కోరుకున్నాననీ నాగార్జున చెప్పారు.